తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'తెరాస, వైకాపా కలిసి 36 సీట్లు గెలుస్తాం'

కారు.. సారు... పదహారు.. కేసీఆర్​ నినాదంతో ముందుకెళ్తున్న తెరాస... ప్రచార జోరుని పెంచింది. వికారాబాద్​ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభకు గులాబీ బాస్​ హాజరయ్యారు. ఏపీలో వైకాపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తెరాస, వైకాపా కలిపి 36 ఎంపీ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

By

Published : Apr 8, 2019, 7:30 PM IST

తెరాస, వైకాప కలిసి 35 ఎంపీ స్థానాలు గెలుస్తాం

హైదరాబాద్​పై చంద్రబాబు శాపాలు పెడుతున్నారని కేసీఆర్​ మండిపడ్డారు. వికారాబాద్​ తెరాస బహిరంగ సభలో పాల్గొన్న ఆయన... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేశవరావు రాజ్యసభలో, ఎంపీలు లోక్​సభలో మాట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణలో ఎంఐఎంతో కలుపుకుని కచ్చితంగా 17 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్​లో జగన్​మోహన్​రెడ్డి గెలుస్తారని జోస్యం చెప్పారు. తెరాస, వైకాపా కలుపుకుని 35 లేదా 36 ఎంపీ స్థానాలు గెలుస్తామని అన్నారు గులాబీ బాస్​. ఆంధ్ర ప్రజలతో తనకెప్పుడూ పంచాయితీ లేదని స్పష్టం చేశారు.

తెరాస, వైకాపా కలిసి 36 ఎంపీ స్థానాలు గెలుస్తాం

For All Latest Updates

TAGGED:

KCR CAMPAIGN

ABOUT THE AUTHOR

...view details