తెలంగాణ

telangana

ETV Bharat / briefs

15 నుంచి శ్రమ్​యోగి మాన్​ధన్

10 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు లబ్ధి చేకూర్చేలా మధ్యంతర బడ్జెట్​లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన పథకం అమలుపై నోటిఫికేషన్​ విడుదల చేసింది కేంద్రం.

By

Published : Feb 10, 2019, 6:43 AM IST

Updated : Feb 10, 2019, 9:14 AM IST

కార్మికులు

అసంఘటిత రంగ కార్మికులంతా ఫిబ్రవరి 15 నుంచి ప్రధానమంత్రి శ్రమ్​యోగి మాన్​ధన్​ పథకంలో చేరవచ్చని కార్మిక శాఖ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ పథకం ద్వారా కార్మికులు 60 ఏళ్ల నుంచి నెలకు కనీసం రూ.3000 పింఛను పొందనున్నారు.

2019-20 బడ్జెట్​ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పీయూష్​ గోయల్​ ఈ పథకాన్ని ప్రకటించారు. 18-40 ఏళ్ల వయస్సు వారు దీనికి అర్హులు. కార్మికులు నెలకు 55 రూపాయలతో ఈ పథకంలో చేరవచ్చు. 40 ఏళ్ల వయస్సు కంటే ఎక్కువ ఉన్నవారు నెలకు రూ.200 జమ చేయాల్సి ఉంటుంది. అదే 29 ఏళ్ల వారికైతే ఈ మొత్తం రూ. 100 మాత్రమే.

కార్మికులు ఇచ్చిన మొత్తానికి సమాన డబ్బును ప్రభుత్వం జమచేస్తుంది. జాతీయ పింఛను పథకం, ఈఎస్​ఐ, ఉద్యోగ భవిష్య నిధి పథకాల్లో ఉన్న వారితో పాటు ఆదాయపు పన్ను కట్టే అసంఘటిత కార్మికులు ఈ పథకానికి అనర్హులు.

లబ్ధిదారు ఏదైనా కారణంతో మరణించినట్లయితే జీవిత భాగస్వామి పథకాన్ని కొనసాగించవచ్చు. అలాకాకుండా అప్పటివరకు జమచేసిన మొత్తాన్ని వడ్డీతో సహా వెనక్కి తీసుకునే అవకాశమూ ఉంది.
లబ్ధిదారుడు శాశ్వత వైకల్యానికి గురైతే... భాగస్వామి ఈ పథకాన్ని కొనసాగించవచ్చు. ఒక వేళ పింఛనుదారు మరణించినట్లయితే జీవిత భాగస్వామి సగం పింఛను మాత్రమే తీసుకునే నిబంధన ఉంది.

Last Updated : Feb 10, 2019, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details