తెలంగాణ

telangana

By

Published : Mar 21, 2019, 11:24 AM IST

Updated : Mar 21, 2019, 2:48 PM IST

ETV Bharat / briefs

డిజిటల్​ వేదిక... సమస్త సమాచార దీపిక

రామోజీ గ్రూప్​ నుంచి వస్తోన్న ఈటీవీ భారత్ యాప్​ ప్రారంభమైంది. 13 భాషల్లో... 29 రాష్ట్రాల్లో సమాచారం అందించడమే లక్ష్యంగా ప్రజల ముందుకు వచ్చింది. రామోజీ ఫిలిం సిటీలో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు యాప్​ను ప్రారంభించారు.

Bharat

ప్రారంభమైన ఈటీవీ భారత్
సమాచార యవనికపై అద్భుతాలతో వార్తా ప్రియులకు కొత్త అనుభూతి పంచే ఈటీవీ భారత్‌ యాప్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ యాప్‌ను రామోజీ గ్రూప్ ఛైర్మన్ రామోజీ రావు ప్రారంభించారు. ఆంగ్ల భాషా యాప్‌ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు శుభారంభం చేశారు. ఆంధ్రప్రదేశ్ యాప్‌ను ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఆరంభిస్తే... ఇతర భాషల యాప్‌లను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు ప్రజలకు పరిచయం చేశారు. సాంకేతికత వినియోగంలో ఎప్పుడూ ముందంజలో ఉండే ఈనాడు... డిజిటల్ వేదికపై మరిన్ని అద్భుతాలు సృష్టించాలని నేతలు, ప్రముఖులు ఆకాంక్షించారు.
Last Updated : Mar 21, 2019, 2:48 PM IST

ABOUT THE AUTHOR

...view details