తెలంగాణ

telangana

ETV Bharat / briefs

5 చడ్డీలు వేసుకుని బంగారం స్మగ్లింగ్​- అధికారి అరెస్ట్

కేరళలోని కొచ్చి​ అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారాన్ని అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించిన ఓ కస్టమ్స్​ అధికారిని సీబీఐ అరెస్టు చేసింది. వారితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ఐదు లోదుస్తుల్లో బంగారాన్ని ఉంచుకొని అధికారుల కళ్లు కప్పాలని ప్రయత్నించాడు ఆ కస్టమ్స్​ అధికారి.

By

Published : May 7, 2019, 9:46 AM IST

స్మగ్లింగ్​ చేస్తూ పట్టుబడిన కస్టమ్స్ అధికారి

కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ హవల్దార్​గా పనిచేస్తున్న ఫ్రాన్సిస్​.. బంగారాన్ని అక్రమ రవాణ చేస్తూ సీబీఐ అధికారులకు చిక్కాడు. అతడి నుంచి రూ.1.01 కోట్లు విలువ చేసే 3 కిలోల బంగారాన్ని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు.

ఫైసల్​, అదినన్​ ఖలీద్ ఇద్దరూ బంగారాన్ని అక్రమ రవాణా చేస్తుంటారు. వీరు కొచ్చి విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారిగా పనిచేస్తున్న ఫ్రాన్సిస్​ సహాయంతో దుబాయి నుంచి తెచ్చిన బంగారాన్ని విమానాశ్రయం నుంచి తరలించాలని ప్రణాళిక వేసుకున్నారు.

మార్చి 1న ఫ్రాన్సిస్​ తన గుర్తింపు (ఐడీ) కార్డును చూపించి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ఫైసల్​ ఆదేశం మేరకు అక్కడే ఉన్న ఖలీద్​.... మరుగుదొడ్డిలో ఫ్రాన్సిస్​కు ఆ బంగారాన్ని అందించాడు. ఫ్రాన్సిస్ ఆ బంగారు కడ్డీలను ఐదు చడ్డీల్లో ఉంచుకుని, విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాడు.

విషయం పసిగట్టిన రెవెన్యూ నిఘా అధికారులు ఫ్రాన్సిస్​ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి సుమారు మూడు కేజీల బరువు ఉండే బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఇద్దరు నిందితులనూ అరెస్టు చేశారు. వీరిపై అవినీతి, నేరపూరిత కుట్ర, మోసం, లంచగొండితనం కేసులు నమోదు చేశారు.

దర్యాప్తులో భాగంగా ఎర్నాకుళంలోని నిందితుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. ఫ్రాన్సిస్​ ఇంతకు మునుపూ ఇలా బంగారాన్ని అక్రమ రవాణా చేసినట్లు, తాజా కేసులో రూ.2 లక్షలు లంచం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.

ఇదీ చూడండి: ప్రమాదం అంచుల్లో అతిపెద్ద బల్లులు

ABOUT THE AUTHOR

...view details