తెలంగాణ

telangana

By

Published : Apr 4, 2019, 11:09 AM IST

ETV Bharat / briefs

తెరపైకి విజయ్​ తమ్ముడు, రాజశేఖర్​ కూతురు

అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించి స్టార్ హీరోగా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తాజాగా అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు.

దొరసాని సినిమాతో హీరోగా పరిచయమవుతున్న ఆనంద్ దేవరకొండ

విభిన్న సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. త్వరలో అతడి తమ్ముడు వెండితెరపై కనిపించనున్నాడు. 'దొరసాని' పేరుతో తెరకెక్కుతున్న చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు.

కేవిఆర్ మహేంద్ర 'దొరసాని' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. హీరో రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక హీరోయిన్​గా అరంగేట్రం చేస్తోంది.

యష్ రంగినేని, మధుర శ్రీధర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఫస్ట్​లుక్ విడుదలైంది. ఇప్పటికే టీజర్​ చిత్రీకరించారని, అందులో హీరో హీరోయిన్ల మధ్య లిప్​లాక్ సీన్ ఉంటుందని సమాచారం.

నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్న బాటలో తమ్ముడు టాలీవుడ్​లో పాగా వేసేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details