తెలంగాణ

telangana

ETV Bharat / briefs

20 నుంచి అమీర్​పేట్​-హైటెక్​సిటీ మెట్రో

ఈ నెలలోనే అమీర్​పేట్​-హైటెక్​ సిటీ మధ్య మెట్రో పరుగులు తీయనుంది. రైళ్లు నడిపేందుకు కమిషనర్​ ఆఫ్​ మెట్రో సేఫ్టీ నుంచి తుది అనుమతులు వచ్చాయి. ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

By

Published : Mar 18, 2019, 8:29 PM IST

Updated : Mar 18, 2019, 8:38 PM IST

అందుబాటులోకిమరో మెట్రో మార్గం

అందుబాటులోకిమరో మెట్రో మార్గం
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. సాఫ్ట్​వేర్​ ఉద్యోగుల కల నెరవేరనుంది. హైటెక్ ​సిటీకి వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్​ కష్టాలు తీరనున్నాయి. పలుమార్లు ట్రయిల్​రన్​, అనేక భద్రతా తనిఖీల అనంతరం రైళ్లు నడిపేందుకు కమిషనర్​ ఆఫ్​ మెట్రో సేఫ్టీ తుది అనుమతులు మంజూరుచేసింది. ఈనెల 20న సాయంత్రం 4గంటల నుంచి అమీర్​పేట్-హైటెక్ ​సిటీ మధ్య మెట్రో పరుగులు తీయనుంది.

స్టేషన్లు ఇవే...
ఈ మార్గంలో అమీర్​పేట్, మధురానగర్, యూసఫ్​గూడ, జూబ్లీహిల్స్ రోడ్​నెంబర్ 5, జూబ్లీహిల్స్ చెక్​పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్​సిటీ స్టేషన్లు ఉన్నాయి. హైదరాబాద్​లో ఇప్పటికే 29 కిలోమీటర్ల మియాపూర్-ఎల్బీనగర్ మార్గం, 17 కిలోమీటర్ల నాగోల్-అమీర్​పేట్​ మార్గాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్గం ప్రారంభమైతే మొత్తం 56 కిలోమీటర్ల పొడవునా మెట్రో అందుబాటులోకి రానుంది.

ఇవీ చూడండి:బరి గీసిన జనసేన

Last Updated : Mar 18, 2019, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details