తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఎటుగుబంటి దాడికి ఓ వ్యక్తి మృతి

పొట్టకూటి కోసం మూలికలు అమ్ముకుంటుంటాడు రాముడు. వాటిని సేకరించేందుకు అడవికి వెళ్లాడు. రాయి పక్కనున్న ఎలుగుబంటిని గమనించలేకపోయాడు. మూలిక తవ్వుదామని ప్రయత్నించేలోపే రాముడి మీద పడి తీవ్ర స్థాయిలో దాడి చేసింది.

By

Published : Jun 23, 2019, 9:03 PM IST

Updated : Jun 23, 2019, 11:15 PM IST

A MAN DIED DUE TO BEAR ATTACK

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో ఎలుగుబంటి దాడికి ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. జీవనోపాధి కోసం మూలికలు సేకరించేందుకు రాముడు సమీపంలోని నల్లమల అడవికి వెళ్లాడు. మూలికలు తవ్వడానికి వెళ్లగా... రాయి పక్కనే ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. తీవ్ర స్థాయిలో గాయాలు కావటంతో రాముడు అక్కడే మృతిచెందాడు. ఈ ఘటనను దూరంగా ఉండి గమనించిన రాముడి మనవరాలు కుటుంబసభ్యులకు తెలుపగా శవాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. పోలీసులు శవ పరీక్ష కోసం కొల్లాపూర్​ ఆస్పత్రికి తరలించారు. రాముడికి ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య నిరంజనమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఎటుగుబంటి దాడికి ఓ వ్యక్తి మృతి
Last Updated : Jun 23, 2019, 11:15 PM IST

ABOUT THE AUTHOR

...view details