ఉత్తర్ప్రదేశ్లోని మహోబా పట్టణంలో ఓ మహిళ అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల క్రితం ముగ్గురు యువకులు బాధిత మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం నాడు బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించాక ఈ విషయం బయటపడింది. అఘాయిత్యం చేస్తూ తీసిన వీడియోతో నిందితులు తనను బ్లాక్మెయిల్ చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
"గతేడాది అక్టోబరు 8న నేను మహోబాకు వచ్చాను. అదే రోజు ముగ్గురు దుండగులు నన్ను ఓ ఇంట్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులు ఈ ఘటనకు సంబంధించి వీడియోను రికార్డ్ చేశారు. నా దగ్గర అప్పుడు ఉన్న 1.5 లక్షలు నగదు, బంగారు గోలుసును తీసుకుని పరారయ్యారు. ఆ తర్వాత కూడా ఘటనకు సంబంధించిన వీడియోతో బెదిరించి నాపై అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు."