తెలంగాణ

telangana

By

Published : Oct 4, 2021, 1:53 PM IST

Updated : Oct 4, 2021, 2:16 PM IST

ETV Bharat / bharat

అమల్లో లేని చట్టాలపై నిరసనలేల?: రైతులకు సుప్రీం ప్రశ్న

సాగు చట్టాలు(new farm laws) అమలులోనే లేనప్పుడు దేనికోసం ఆందోళన చేస్తున్నారని రైతు సంఘాలను ప్రశ్నించింది సుప్రీం కోర్టు(Supreme Court news). దిల్లీలోని జంతర్​మంతర్(jantar mantar)​ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు అనుమతించాలన్న పిటిషన్​పై విచారణ చేపట్టింది.

supreme court
సుప్రీం కోర్టు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలకు(new farm laws) వ్యతిరేకంగా దిల్లీ జంతర్​మంతర్​ వద్ద సత్యాగ్రహ దీక్ష చేసేందుకు అనుమతించాలని కోరుతూ కిసాన్​ మహాపంచాయత్​ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు(Supreme Court news). ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. సాగు చట్టాలపై స్టే విధించామని, అసలు ఆ చట్టాలు(new farm laws) అమలులోనే లేనప్పుడు దేనికోసం ఆందోళన చేస్తున్నారని రైతు సంఘాలను జస్టిస్​ ఏఎం ఖాన్​విల్కర్​, జస్టిస్​ సీటీ రవికుమార్​ల ధర్మాసనం ప్రశ్నించింది.

" చట్టాల చెల్లుబాటును సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన తర్వాత నిరసనకు ఎక్కడకు వెళ్లాలి అనే ప్రశ్న ఎక్కడ ఉంది? నూతన సాగు చట్టాలపై అత్యున్నత న్యాయస్థానం​ స్టే విధించింది. ప్రస్తుతం ఆ చట్టాలు అమలులో లేవు. దేనికోసం ఆందోళన చేస్తున్నారు?"

- సుప్రీం కోర్టు.

ఒకసారి సమస్య(new farm laws) అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత.. అదే అంశంపై ఎవరూ రోడ్లపైకి రాకూడదన్నారు సోలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.

'ఎవరూ బాధ్యత వహించరు..'

ఉత్తర్​ప్రదేశ్​ లఖింపుర్​ ఖేరిలో ఆదివారం జరిగిన హింసాత్మక సంఘటనలను అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా.. అలాంటి దురదృష్టకర సంఘటనలకు ఎవరూ బాధ్యత వహించరని వ్యాఖ్యానించింది కోర్టు.

ఇదీ చూడండి:'కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు ఇవ్వాల్సిందే'

Last Updated : Oct 4, 2021, 2:16 PM IST

ABOUT THE AUTHOR

...view details