తెలంగాణ

telangana

By

Published : Jan 5, 2021, 12:45 PM IST

ETV Bharat / bharat

కేరళ ఆటోల్లో పోస్టల్​ శాఖ డిజిటల్​ చెల్లింపులు

దేశంలోనే మొట్టమొదటి డిజిటల్​ ఆటో స్టాండ్​ ప్రారంభమైంది. కేరళలోని పాలక్కడ్​ జిల్లా పయంబలక్కోడులో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆన్​లైన్​ ఆటో-రిక్షాను కేంద్ర ఐటీ పరిశ్రమల మంత్రి రవి శంకర్​ ప్రసాద్​ ప్రశంసించారు. దేశంలో డిజిటల్​ విధానం మరింత విస్తరిస్తోందన్నారు.

The first digital auto stand in Kerala at Palakkad
కేరళ ఆటోల్లో ఇక డిజిటల్​ చెల్లింపులు

కేరళలోని పాలక్కడ్​ జిల్లా పయంబలక్కోడు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆన్​లైన్​​ ఆటో-రిక్షా వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆటో డ్రైవర్లు సహా.. ఆటో స్టాండు మొత్తాన్ని డిజిటల్​ విధానంలో రూపొందించారు. ఐపీపీబీ ప్రయత్నాన్ని.. చొరవను కేంద్ర ఐటీ పరిశ్రమల మంత్రి రవి శంకర్​ ప్రసాద్​ ప్రశంసించారు. దేశంలో డిజిటల్​ విధానం మరింత విస్తరిస్తోందన్నారు.

డాక్​-పే..

ఈ-ఆటోల్లో ప్రయాణించే వారు ఏదైనా యూపీఐ యాప్​ సాయంతో డాక్​-పే క్యూఆర్​ కోడ్​ ఉపయోగించి సులువుగా చెల్లింపులు చేయవచ్చని పోస్టల్ అధికారులు చెబుతున్నారు. ఆ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ప్రాజెక్టు.. ఆటో డ్రైవర్లకు వెసులుబాటుగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రయాణికులు ఐపీపీబీ యాప్​ను కలిగి ఉంటారని.. వీరంతా నేరుగా పోస్టల్​ బ్యాంకు ఖాతా క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేయడం ద్వారా నిమిషాల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు.

స్మార్ట్ డ్రైవర్లు..

కేరళలో అందుబాటులోకి వచ్చిన తొలి డిజిటల్​ ఆటో విధానాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్​ ప్రసాద్​ ప్రశంసించారు. ఈ ఆటో నడిపేవారు స్మార్ట్ డ్రైవర్లంటూ కితాబిచ్చారు. ఈ మేరకు ట్విట్టర్​లో స్పందించిన మంత్రి.. ఈ మోడల్​ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్రశంసించారు.

ఇదీ చదవండి:'శాస్త్ర రంగంలో పురోగతికి ఇది నిదర్శనం'

ABOUT THE AUTHOR

...view details