తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోనియా అధ్యక్షతన కాంగ్రెస్​​ పార్లమెంటరీ పార్టీ భేటీ

సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ వర్చువల్​గా సమావేశమైంది. వచ్చే రెండో బడ్జెట్​ సమావేశాల్లో కాంగ్రెస్​ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించారు.

By

Published : Mar 7, 2021, 5:57 PM IST

Sonia chairs meeting on Parliamentary strategy
పార్టీ నాయకులతో కాంగ్రెస్​ అధినేత్రి సోనియా భేటీ

మరికొద్ది రోజుల్లో రెండో బడ్జెట్​ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్​ పార్లమెంటరీ పార్టీ వర్చువల్​గా భేటీ అయింది. వచ్చే బడ్జెట్​ సమావేశాల్లో కాంగ్రెస్​ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధినేత్రి సోనియాగాంధీ చర్చించారు.

పార్లమెంట్​లో ప్రధానంగా వ్యవసాయ చట్టాలు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, పెట్రోల్​ ధరలపై కేంద్రాన్ని నిలదీయాలని సమావేశంలో చర్చించారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాలపై కేంద్రం విధించిన నిబంధనల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్​ అసంతృప్త జీ-23 నాయకులు ఆనంద్​ శర్మ, మనోజ్​ తివారీ పాల్గొన్నారు. వారితో పాటు రాజ్యసభలో కాంగ్రెస్​ ప్రతిపక్షనేత, కొత్తగా ఎన్నికైన సభ్యులు మల్లికార్జున ఖర్గే హాజరయ్యారు.

ఇదీ చదవండి:దీదీ.. మీరు మారిపోయారు, ముందులా లేరు: మోదీ

ABOUT THE AUTHOR

...view details