తెలంగాణ

telangana

ఐఫోన్​ కోసం దారుణం.. లేడీ టీచర్​ను రోడ్డు మీద లాక్కెళ్లిన దొంగలు

School Teacher Dragged by Snatchers : ఓ ఫోన్​ కోసం మహిళ పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించారు ఇద్దరు బైకర్లు. వారి దుశ్చర్యతో ఆమె తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది.

By

Published : Aug 14, 2023, 2:17 PM IST

Published : Aug 14, 2023, 2:17 PM IST

Updated : Aug 14, 2023, 2:30 PM IST

school teacher dragged by snatchers
ఫోన్​ను లాక్కెళుతున్న దొంగలు

School Teacher Dragged by Snatchers :యాపిల్​ ఫోన్‌ను దొంగతనం చేసేందుకు ఇద్దరు బైకర్లు అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఫోన్​ కోసం ఓ మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. ఈ దారుణ ఘటన దక్షిణ దిల్లీలో శుక్రవారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
బాధితురాలు యొవికా చౌదరి (24) దక్షిణ దిల్లీలోని జ్ఞాన్​ భారతి పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఆటోలో ఇంటికి వెళ్తున్నారు. ​ ఆమె వద్ద ఉన్న ఐఫోన్‌ను గమనించిన దుండగులు దానిని కొట్టేసేందుకు ప్రణాళిక రచించారు. రెండు ద్విచక్రవాహనాలపై వచ్చిన వారు ఆటోలో వెళ్తోన్న యొవికా చౌదరి దగ్గర ఉన్న ఫోన్‌ను లాక్కోవాలని చూశారు. దీనికి యొవికా ప్రతిఘటించడం వల్ల జరిగిన పెనుగులాటలో ఆమె ఆటో నుంచి కిందపడిపోయింది.

అక్కడితో వదలని నిందితులు ఆ ఫోన్‌ కోసం యొవికా చౌదరి రోడ్డుపై అలాగే ఈడ్చుకెళ్లారు. వారితో పోరాడలేని ఆమె ఫోన్‌ను వదిలేయడం వల్ల వారు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం సాకేత్​లోని మాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసుల.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

యువకుడిని ఈడ్చుకెళ్లిన ముగ్గురు దుండగులు..
Three Bullies Dragged Young Man From Scooty :అంతకుముందు ఉత్తర్​ప్రదేశ్​ బరేలీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ యువకుడిని రోడ్డుపై దారుణంగా ఈడ్చుకెళ్లారు ముగ్గురు దుండగులు. స్కూటీపై వెళ్తూ అందరూ చూస్తుండగా యువకుడిని లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఇదీ జరిగింది..
అందరూ చూస్తుండగానే.. ముగ్గురు దుండగులు స్కూటీపై వెళ్తూ ఓ యువకుడి చేయి పట్టుకుని ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్​ చేయగా.. వైరల్​గా మారింది. అనంతరం పోలీసుల దృష్టికి వెళ్లడం వల్ల ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన బారాదారీ ప్రాంతంలోని సంజయ్​ నగర్​లో జరిగిందని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేశారు. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బస్సు ఢీకొని బైకర్ మృతి.. బైక్​ను 12 కి.మీ లాక్కెళ్లిన డ్రైవర్.. ఆఖరికి..

డెలివరీ బాయ్​ను ఢీకొట్టి 100మీ లాక్కెళ్లిన కారు డ్రైవర్.. అక్కడికక్కడే మృతి.. కి.మీ ఛేజ్ చేసి మరీ..

Last Updated : Aug 14, 2023, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details