Purnea Accident: బిహార్ పూర్ణియాలోని జాలాల్గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 57పై పైపుల లోడ్తో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 8 మంది అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో ట్రక్కులో మొత్తం 12 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
ట్రక్కు బోల్తా పడి 8 మంది కూలీలు దుర్మరణం - purnia road accident
Bihar Accident: పైపుల లోడ్తో వెళ్తున్న ట్రక్కు బోల్తాపడి 8 మంది దుర్మరణం చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. బిహార్ పూర్ణియాలో ఈ దుర్ఘటన జరిగింది.

ఘోర రోడ్డు ప్రమాదం
అయితే ట్రక్కు ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తుంది అనే విషయంపై స్పష్టత లేదు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. స్థానికులు మాత్రం అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నట్లు అన్పించిందని తెలిపారు. అతని నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఘటనలో మరణించినవారంతా రోజూ కూలీ పని చేసుకుని జీవనం సాగించే వారేనని తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:దళితుడి నోట్లోని ఆహారాన్ని తీయించుకొని తిన్న ఎమ్మెల్యే!
Last Updated : May 23, 2022, 11:42 AM IST