తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2022, 7:11 PM IST

ETV Bharat / bharat

తోటి విద్యార్థి పట్ల అమానుషం.. నగ్నంగా చేసి, చితకబాది...

ragging at Sambalpur: ఒడిశాలో ర్యాగింగ్ కలకలం రేపింది. పదో తరగతి విద్యార్థులు తమ సహచర విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. బాధితుడిని శారీరకంగా, మానసికంగా హింసించారు.

ragging at sambalpur
ఒడిశాలో ర్యాగింగ్

ragging at Sambalpur: విద్యార్థులు తమ సహచర విద్యార్థినే దారుణంగా ర్యాగింగ్ చేశారు. ఈ ఘటన ఒడిశాలోని సంబల్​పుర్​ జిల్లా మఝిపాలిలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ స్కూల్‌లో జరిగింది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు తమ సహచర విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాధితుడి దుస్తులు విప్పించి.. శారీరకంగా, మానసికంగా హింసించారు. ఈ ఘటన ఏప్రిల్ 17వ తేదీన.. స్కూల్ హాస్టల్​లో జరిగింది. దీంతో బాధితుడు తన తల్లిదండ్రులకు జరిగిదంతా ఫోన్​లో చెప్పాడు. వీరిలో ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు బాలుడిపై భౌతికంగా దాడి చేయగా.. మరో ఆరుగురు వారికి సహకరించారు.

దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు.. ఒడిశా స్కూల్ అండ్ మాస్ ఎడ్యుకేషన్ విభాగానికి ఫిర్యాదు చేశారు. అనంతరం ర్యాగింగ్‌ ఘటనపై బాధితుడి తండ్రి పాఠశాల ఎండీకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో పాఠశాల యజమాన్యం ఎనిమిది మందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. వీరందరినీ హాస్టల్ నుంచి సస్పెండ్ చేసింది.

ఇదీ చదవండి:దగ్గు టానిక్​కు బదులు 'పేల మందు'- ప్రాణాపాయంలో మహిళ!

ABOUT THE AUTHOR

...view details