తెలంగాణ

telangana

By

Published : May 28, 2022, 3:39 PM IST

Updated : May 28, 2022, 4:41 PM IST

ETV Bharat / bharat

'ఆప్​' సర్కార్​ మరో కీలక నిర్ణయం.. 424 మంది వీఐపీలకు భద్రత కట్​!

Punjab Govt Withdraws Security: పంజాబ్​లో అధికారంలో ఉన్న ఆప్​ సర్కార్​.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు రాజకీయ ప్రముఖులు, మతపెద్దలకు భద్రతను తొలగించింది. మొత్తం 424 మందికి పోలీసు భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు శనివారం ప్రకటించింది.

Punjab govt withdraws security cover provided to 424 people
Punjab govt withdraws security cover provided to 424 people

Punjab Govt Withdraws Security: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వీఐపీ సంస్కృతికి తెరదించేందుకు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆ మధ్య మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను రద్దు చేసిన భగవంత్‌ మాన్‌ సర్కారు.. తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు, మతపెద్దలకు కూడా భద్రతను తొలగించింది. రిటైర్డ్‌ పోలీసు అధికారులు, మత పెద్దలు, రాజకీయ నేతలు ఇలా 424 మందికి కేటాయించిన పోలీసు భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. డేరా రాధ సోమీ బ్యాస్‌కు ఉన్న 10 మంది భద్రతను కూడా తొలగించినట్లు తెలిపింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో 184 మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను ఉపసంహరించుకుంటున్నట్లు మాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీతో పాటు మాజీ మంత్రులు మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌, రాజ్‌ కుమార్‌ వెర్కా, భరత్ భూషణ్‌ అషు వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ నిర్ణయంతో 400 మందికి పైగా పోలీసు సిబ్బంది తిరిగి పోలీసు స్టేషన్లకు వచ్చినట్లు సీఎం మాన్‌ అన్నారు. పోలీసులు సామాన్య ప్రజల కోసం పని చేయాలి గానీ.. వీఐపీలకు భద్రతా విధుల పేరుతో వారిని బాధపెట్టకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు మాన్‌ వెల్లడించారు.

సీఎం భగవంత్​ మాన్​

అంతకుముందు, మాజీ ఎమ్మెల్యేల పింఛను విషయంలోనూ మాన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ్యులుగా ఎన్నిసార్లు ఎన్నికైనా.. ఇకపై ఒకేఒక్క పదవీకాలానికి ప్రభుత్వం పింఛను అందజేస్తుందని ప్రకటించారు.ప్రస్తుతం రాష్ట్రంలో ఒకసారి శాసనసభ్యునిగా ఎన్నికైనవారికి పదవీకాలం ముగిశాక నెలకు రూ.75 వేల చొప్పున పింఛను చెల్లిస్తున్నారు. తరవాత ప్రతి పదవీకాలానికి ఈ పింఛను మొత్తంలో 66 శాతాన్ని అదనపు పింఛనుగా ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడున్నర లక్షల నుంచి అయిదున్నర లక్షల రూపాయల వరకు పింఛను తీసుకునే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని, ఈ నిర్ణయం వల్ల కోట్లాది రూపాయలు ప్రజా ప్రయోజనాలకు ఖర్చు పెట్టే అవకాశం లభిస్తుందని సీఎం మాన్‌ అన్నారు. అయితే దీనిపై రాష్ట్ర శాసనసభలో బిల్లు తీసుకురావాలని పంజాబ్‌ గవర్నర్‌.. ప్రభుత్వానికి సూచించారు.

ఇవీ చూడండి:భక్తుల బూట్లు తుడిచిన కాంగ్రెస్​ సీనియర్​ నేత

'కొత్త మంత్రి'పై సీఎం వేటు.. వెంటనే అరెస్ట్.. అసలేం జరిగింది?

Last Updated : May 28, 2022, 4:41 PM IST

ABOUT THE AUTHOR

...view details