తెలంగాణ

telangana

భారత్​లో ఇక నుంచి గర్భిణులకు టీకా

By

Published : Jul 2, 2021, 6:58 PM IST

Updated : Jul 2, 2021, 7:37 PM IST

భారత్​లో ఇక నుంచి గర్భిణులకు కొవిడ్ టీకా ఇవ్వనున్నారు. ఈ మేరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

pregnant women, vaccine
గర్భిణులు, టీకా

కొవిడ్ వ్యాప్తి కట్టడిలో భాగంగా గర్భిణులకు టీకా ఇచ్చేందుకు భారత్​ సన్నద్ధమవుతోంది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్యూనైజేషన్(ఎన్​టీఏజీఐ) చేసిన సిఫార్సుకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది.

కొవిన్​ యాప్​లో రిజిస్టరై లేదా నేరుగా వ్యాక్సినేషన్​ కేంద్రాలకు వెళ్లైనా గర్భిణులు టీకా తీసుకోవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం అందించినట్లు పేర్కొంది.

కొవిడ్​ టీకాలకు సంబంధించి గర్భిణులకు అవగాహన కల్పించడం కోసం వ్యాక్సినేటర్లు, ఫ్రంట్​లైన్​ వర్కర్లకు కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవలే మార్గదర్శకాలు రూపొందించినట్లు గుర్తుచేసింది.

గర్భస్థ పిండంపై ప్రభావం..

గర్భిణులకు కొవిడ్​ సోకితే.. అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని కొన్ని అధ్యయనాలు వెల్లడించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. సాధారణ మహిళలతో పోల్చితే గర్భిణులపైనే కొవిడ్​ ప్రభావం తీవ్రంగా ఉందని గుర్తుచేసింది. గర్భస్థ పిండంపై ప్రభావం పడుతుందని తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గర్భిణులకు టీకాపై కీలక మార్గదర్శకాలను జారీ చేసినట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:గర్భిణులు టీకా తీసుకోవడం సురక్షితమేనా?

Last Updated : Jul 2, 2021, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details