తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భయం లేకుండా పనిచేయండి.. సీఎంకు మోదీ భరోసా!

రాష్ట్ర ప్రయోజనాల కోసం భయం లేకుండా, విధేయతతో పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi news).. తనకు సూచించారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. దిల్లీలో మోదీతో 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు.

By

Published : Nov 11, 2021, 2:56 PM IST

BOMMAI PM BITCOIN
bommai pm meet

కర్ణాటకలో బిట్​కాయిన్ కుంభకోణంపై (Karnataka Bitcoin scam) విపక్షాల విమర్శలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై.. ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ధైర్యంగా, విధేయతతో పనిచేయాలని మోదీ (PM Modi news) తనకు సూచించినట్లు తెలిపారు సీఎం.

రెండు రోజుల పర్యటన కోసం దిల్లీకి వెళ్లిన బొమ్మై(Bommai Bitcoin).. ప్రధాని నివాసంలో మోదీని కలిశారు. ఇరువురు 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. గడిచిన వంద రోజుల్లో తీసుకున్న పాలనాపరమైన నిర్ణయాల గురించి మోదీకి వివరించారు.

"బిట్ కాయిన్ కుంభకోణం (Karnataka Bitcoin scam) గురించి ప్రధానికి వివరించేందుకు ప్రయత్నించా. కానీ ఆందోళన చెందవద్దని ఆయన(మోదీ) నాతో అన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం నిబద్ధతతో, ధైర్యంగా పనిచేయాలని సూచించారు. మిగిలిన విషయాలు వాటంతట అవే బాగవుతాయని చెప్పారు."

-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి

ఇటీవల బెంగళూరుకు చెందిన హ్యాకర్ శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి నుంచి అధికారులు రూ.9 కోట్లు విలువైన బిట్​కాయిన్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ పోర్టల్​లలోకి చొరబడి హ్యాకింగ్​కు యత్నించినట్లు శ్రీకిపై ఆరోపణలు ఉన్నాయి. క్రిప్టోకరెన్సీ చెల్లించి డార్క్​నెట్ ద్వారా డ్రగ్స్​ సైతం కొనుగోలు చేశాడని అతడిపై అభియోగాలు మోపారు.

అయితే, ఈ వ్యవహారం (Karnataka Bitcoin scam) రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ విషయంలో అధికార పార్టీకి చెందిన పెద్ద నేతల హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. బొమ్మై తన ముఖ్యమంత్రి పదవిని కోల్పోతారని కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే అన్నారు. ఈ ఘటనపై నిజానిజాలను భాజపా కప్పిపెడుతోందని ఆరోపించారు.

ఇదీ చదవండి:'రాష్ట్రాల సహకార స్ఫూర్తితోనే కరోనా నిర్మూలన'

ABOUT THE AUTHOR

...view details