తెలంగాణ

telangana

By

Published : Jan 1, 2023, 7:45 PM IST

Updated : Jan 1, 2023, 10:36 PM IST

ETV Bharat / bharat

న్యూఇయర్ రోజు విషాదం.. ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం.. 10 మంది మృతి

ఓ పికప్ వ్యాన్​.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో పది మరణించారు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది. మరోవైపు, ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.

pick up van collide truck
రోడ్డు ప్రమాదం

రాజస్థాన్​ సికర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖండేలా- పల్సానా రహదారిపై ఓ పికప్​ వ్యాన్​.. బైక్​ను ఢీకొట్టి అనంతరం అదుపు తప్పి ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో పది మృతి చెందారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఘటనాస్థలిలోనే ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే వారు ప్రాణాలు కోల్పోయారు. మృతులందరూ సమోద్ ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. పికప్ వ్యాన్​లో ఉన్నవారు ఖండేలాలోని ఓ ఆలయ సందర్శనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.

బస్సును ఢీకొట్టిన కారు..
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోవా నుంచి వస్తున్న ఓ కారు అదుపు తప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలవ్వగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులందరూ తమిళనాడుకు చెందినవారని పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుడిని అంకోలా ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతులందరూ గోవాలో న్యూ ఇయర్ వేడుకలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైందని వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నారని పేర్కొన్నారు.

ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు
Last Updated : Jan 1, 2023, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details