తెలంగాణ

telangana

250కిలోల వెండి.. 50కేజీల పసిడితో అమ్మవారి అలంకరణ

By

Published : Oct 12, 2021, 11:24 AM IST

దేవి నవరాత్రి(durga navratri) సందర్భంగా అమ్మవారి మండపాలను తొమ్మిది రోజుల్లో వివిధ రకాలుగా అలంకరిస్తారు. అందులో భాగంగా ఒడిశాలో కటక్​లో దుర్గమ్మను దాదాపు 50 కిలోల పసిడి సహా 250 కేజీల వెండితో అలంకరించారు నిర్వహకులు.​ అయితే కరోనా కారణంగా పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నట్లు స్థానిక మున్సిపల్​ అధికారులు తెలిపారు.

Durga Navratri
పసిడితో దుర్గమ్మ అలంకరణ

పసిడి, వెండితో దుర్గమ్మ అలంకరణ

దేశవ్యాప్తంగా దుర్గాదేవి నవరాత్రి(durga navratri) ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకో విధంగా అమ్మవారిని అలంకరిస్తున్నారు నిర్వహకులు. దేవిని పుష్పాలు, వివిధ రకాల ఆకులతో చాలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో దుర్గమ్మను వినూత్నంగా కనిపించేలా కరెన్సీ నోట్లతో అలంకరిస్తున్నారు. ఒడిశాలోని కటక్​లో కొలువైన దుర్గమ్మను కిలోల కొద్ది బంగారం, వెండితో అలంకరించారు.

బంగారంతో అలంకరించిన దుర్గమ్మ

కటక్​ చౌధురి బజార్​లోని కొలువుదీరిన దేవి విగ్రహాన్ని(durga puja) ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 250 కేజీల వెండి, 40 నుంచి 50 కిలోల బంగారంతో అలంకరించారు. ఈ బంగారు ఆభరణ అలంకరణతో ఎంతో రమణీయంగా అమ్మవారు దర్శనమిస్తోంది.

ఆభరణ అలంకరణంలో అమ్మవారు
పసిడితో దుర్గమ్మ అలంకరణ

అమ్మవారిని చూడటానికి పెద్దఎత్తున భక్తులు వస్తున్నప్పటికీ.. కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నట్లు కటక్​​ మున్సిపల్​ అధికారులు​ తెలిపారు. కొవిడ్​ కేసులు ఎక్కువగా నమోదవడం వల్ల రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్​కర్ఫ్యూ అమలవుతోందని పేర్కొన్నారు.

ఆభరణ అలంకరణంతో అందంగా కొలువుతీరిన అమ్మవారు

భద్రత కట్టుదిట్టం

అలాగే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నిఘా నేత్రల(సీసీ కెమెరా) సాయంతో రక్షణ కల్పిస్తున్నారు.

సీసీ కెమెరాలతో భద్రత

ఇదీ చూడండి:భర్త కట్టించిన దుర్గమ్మ గుడిలో ముస్లిం మహిళ పూజలు

ABOUT THE AUTHOR

...view details