తెలంగాణ

telangana

జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్​సీపీ సింగ్​!

By

Published : Dec 27, 2020, 3:18 PM IST

Updated : Dec 27, 2020, 3:43 PM IST

Nitish Kumar close confidant RCP Singh chosen new president of   JD(U)
Nitish Kumar close confidant RCP Singh chosen new president of JD(U)

15:16 December 27

జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్​సీపీ సింగ్​!

జనతా దళ్​ యునైటెడ్​(జేడీయూ)లో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​కు అత్యంత సన్నిహితుడైన ఆర్​సీపీ సింగ్​కు జేడీయూ పగ్గాలు అప్పగించనున్నట్లు సమాచారం.

ఇటీవల జరిగిన బిహార్​ ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఫలితాలు, అరుణాచల్​ప్రదేశ్​లో పార్టీని వీడి ఆరుగురు ఎమ్మెల్యేలు భాజపా తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో జేడీయూ అధ్యక్షుడి మార్పు అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది.

నితీశ్​ కుమార్​కు ఆర్​సీపీ సింగ్​ అత్యంత సన్నిహితుడు. జేడీయూ మండలి సమావేశంలో ఆర్​సీపీ సింగ్​ పేరును నితీశ్​ స్వయంగా ప్రతిపాదిస్తూ తీర్మానం చేసినట్టు తెలుస్తోంది. అనంతరం నితీశ్​ తీర్మానానికి ఏకగీవ్రంగా ఆమోదం లభించినట్టు సమాచారం. 

ఇదీ చూడండి:-బంగాల్​ బరిలో జేడీయూ.. భాజపాపై​ ప్రభావమెంత?

Last Updated : Dec 27, 2020, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details