తెలంగాణ

telangana

By

Published : May 26, 2021, 5:17 PM IST

ETV Bharat / bharat

గర్భిణీకి వైద్యం నిరాకరణ.. బిడ్డను కోల్పోయి వేదన

పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి వైద్యం అందక ఆస్పత్రి ఎదుటే ప్రసవించింది. నవజాత శిశువు పుట్టగానే చనిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని మండ్యలో జరిగింది.

Newborn baby dies
గర్భిణీకి వైద్యం నిరాకరణ

కరోనా రిపోర్టు లేదని గర్భిణీని చేర్చుకోని ఆస్పత్రి వైద్యులు

కర్ణాటకలోని మండ్యలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి వైద్యం అందక ఆస్పత్రి ఎదుటే ప్రసవించింది. నవజాత శిశువు పుట్టగానే చనిపోయింది.

మంగళవారం పురిటి నొప్పులతో బాధపడుతున్న సోనూ.. మండ్యలోని ఎమ్​ఐఎమ్​ ఆస్పత్రికి వెళ్లారు. కొవిడ్ రిపోర్ట్‌ లేదని వైద్యం చేసేందుకు డాక్టర్లు నిరాకరించారు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడినా పురుడు పోసేందుకు ముందుకు రాలేదు. నొప్పులు తాలలేక సోనూ అక్కడే ప్రసవించింది. ప్రసవించిన కొద్దిసేపటికే బిడ్డను కోల్పోయి కన్నీరుమున్నీరైంది.

ABOUT THE AUTHOR

...view details