ఒకరికి జరిగిన నష్టం మరొకరికి లాభం చేకూరుస్తుందని అంటారు. ఇలాంటి సంఘటనే ఛత్తీస్గఢ్లో జరిగింది. కోళ్లతో వెళ్తున్న ఓ వాహనం బోల్తాపడగా.. వాటిని తీసుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. ఛత్తీస్గఢ్లోని బేమెతరా- నవాగఢ్ రహదారిపై ఈ సంఘటన జరిగింది.
బేమెతరా నుంచి నవాగఢ్కు కోళ్లతో వెళ్తున్న ఓ ట్రక్కు.. అట్రియా గ్రామసరిహద్దులో అదుపు తప్పి బోల్తా పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. చిన్నాపెద్దా తేడాలేకుండా కోళ్లకోసం ఎగబడ్డారు. దొరికిన వారు దొరికినట్టుగా కోళ్లను తీసుకుని ఇళ్లకు వెళ్లారు.