తెలంగాణ

telangana

విపక్షాల ఐక్యతకు దీదీ పిలుపు.. ఆ పార్టీలకు లేఖ

By

Published : Mar 29, 2022, 12:55 PM IST

Mamata Banerjee letter: కేంద్రంలోని భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంగాల్ సీఎం మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో మరోసారి గళమెత్తారు. విపక్షాలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. అభ్యుదయ శక్తులన్నీ ఒక వేదికపై సమావేశమై.. ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు భాజపాయేతర పార్టీలకు లేఖ రాశారు.

Mamata Banerjee
Mamata Banerjee

Mamata Banerjee letter: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకమవ్వాలని భాజాపాయేతర పార్టీలు, ముఖ్యమంత్రులకు బంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. ఈ మేరకు వ్యూహాలపై చర్చించే సమావేశం కోసం పిలుపునిచ్చారు. భాజపాయేతర పార్టీలన్నీ ఐక్యత సాధించి.. దేశం కోరుకునే ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేసే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించాలని లేఖలో పేర్కొన్నారు.

భాజపా అణచివేత పాలనపై పోరాడేందుకు ప్రగతిశీల శక్తులన్నీ చేతులు కలపాలి. దేశంలోని సంస్థాగత ప్రజాస్వామ్య విలువలపై భాజపా చేస్తున్న ప్రత్యక్ష దాడులపై ఆందోళన వ్యక్తం చేసేందుకే మీకు ఈ లేఖ రాస్తున్నా. సీబీఐ, ఈడీ, సీవీసీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకొని ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఈ అంశంపై ముందుకు సాగేందుకు ఒక వేదికగా ప్రతిపక్ష పార్టీల నేతలందరం సమావేశం కావాలి. మన దేశానికి అవసరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో ఐక్యంగా, విలువలతో కూడిన ప్రతిపక్షం కోసం మనం కట్టుబడి ఉండాలి.
-మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి

ఇదీ చదవండి:సంపన్న కుటుంబంలో స్వతంత్ర జెండా.. ఉరికంబాన్ని ముద్దాడి..

ABOUT THE AUTHOR

...view details