తెలంగాణ

telangana

By

Published : Sep 28, 2021, 9:22 PM IST

Updated : Sep 28, 2021, 10:06 PM IST

ETV Bharat / bharat

కేరళలో 11వేల కరోనా కేసులు- ఆంక్షలు పొడిగింపు

కేరళలో కరోనా కేసులు(Kerala Covid Cases) క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 11,196 మందికి వైరస్(Kerala Covid Cases)​ సోకినట్లు తేలింది. మరో 114 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను అక్టోబర్​ 31వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం మంగళవారం తెలిపింది.

kerala covid cases
కేరళలో కరోనా కేసులు

కరోనా విజృంభణతో అతలాకుతలమైన కేరళ.. ఇప్పడిప్పుడే కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో రోజువారీగా నమోదయ్యే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 11,196 కేసులు వెలుగు చూశాయి. మరో 149 మంది వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరో 18,849 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

వివిధ రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు..

  • మహారాష్ట్రలో కొత్తగా 2,844 కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. 3,029 మంది కోలుకోగా,60 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో కొత్తగా 1,630 కేసులు నమోదయ్యాయి. 1,643 మంది కోలుకోగా, 17 మంది మృతి చెందారు.
  • కర్ణాటకలో కొత్తగా 629 కేసులు నమోదు కాగా.. 782 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 17 మంది మరణించారు.
  • బంగాల్​లో కొత్తగా 708 కేసులు నమోదయ్యాయి. మరో 13 మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
  • మిజోరంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. అక్కడ కొత్తగా 324 మంది చిన్నారులు సహా మొత్తం 1,846 మంది కరోనా బారిన పడ్డారు. మరొకరు వైరస్​కు బలయ్యారు.

దేశ రాజధాని దిల్లీలో 34 మందికి వైరస్​ సోకగా.. మరో ఇద్దరు మరణించారు.

ఆంక్షలు పొడిగింపు..

మరోవైపు.. దేశవ్యాప్తంగా కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను అక్టోబరు 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం మంగళవారం తెలిపింది. కొన్ని రాష్ట్రాల్లో స్థానికంగా కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ మేరకు మంగళవారం.. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్​ భల్లా నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు.

రానున్న పండుగ రోజుల్లో ప్రజలంతా కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అజయ్ భల్లా ఆదేశించారు. వైరస్​ వ్యాప్తి అధికంగా ఉన్న జిల్లాల్లో సంబంధిత అధికారులు.. కరోనా ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని చెప్పారు. 'టెస్ట్​-ట్రాక్​-ట్రీట్​-వ్యాక్సినేషన్-కరోనా నిబంధనలు పాటించడం' అనే ఐదు అంశాలపై దృష్టి సారించడం కొనసాగించాలని పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్..

దేశంలో కొవిడ్​ టీకా పంపిణీ ప్రక్రియ(Vaccination Status In India) కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి 87.6 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా 49 లక్షల డోసులు పంపిణీ చేసినట్లు చెప్పింది.

ఇదీ చూడండి:'కథ ముగియలేదు.. సుదీర్ఘకాలంపాటు కరోనా వ్యాప్తి!'

Last Updated : Sep 28, 2021, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details