తెలంగాణ

telangana

కేరళలో మరో 5,711 మందికి కరోనా

దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో కొవిడ్​ కేసులు మళ్లీ పెరుగుతూ ఉన్నాయి. కేరళలో 5,711 పాజిటివ్​ కేసులు నిర్ధరణ అయ్యాయి. మహారాష్ట్రలో 3,800లకుపైగా కేసులు నమోదయ్యాయి.

By

Published : Dec 20, 2020, 10:35 PM IST

Published : Dec 20, 2020, 10:35 PM IST

Kerala coronavirus tally touches 7.05 lakh with 5,711 new additions
కేరళలో కొత్తగా 5,711 మందికి వైరస్

కేరళలో కరోనా వైరస్​ ఆందోళనకర స్థాయిలో విస్తరిస్తోంది. కొద్దిరోజులుగా రోజుకు సగటున 5వేల మందికిపైగా కొవిడ్​ బారినపడుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 5,711 వైరస్​ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా బాధితుల సంఖ్య 7.05 లక్షలకు చేరింది. మహమ్మారి ధాటికి మరో 30 మంది మరణించగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,816కు ఎగబాకింది. పాజిటివ్​ రేటు 10.6గా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

  • మహారాష్ట్రలో కొత్తగా 3,811 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18.96 లక్షలకు పెరిగింది. వైరస్​తో పోరాడుతూ మరో 98 మంది చనిపోగా.. మృతుల సంఖ్య 48వేల 746కి చేరింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజులోనే 1,247 మంది కొవిడ్​ బారినపడ్డారు. కేసుల సంఖ్య 5.74 లక్షలకు ఎగబాకింది. వైరస్ ధాటికి మరో 19 మంది బలవ్వగా.. చనిపోయిన వారి సంఖ్య 8,196కు చేరింది.
  • కర్ణాటకలో శనివారం రోజు 1,194 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 9.09లక్షల చేరింది. వైరస్​తో మరో 5 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 12,009 గా ఉంది.
  • తమిళనాడులో ఒక్కరోజులోనే 1,114 వైరస్​ కేసులు నమోదయ్యాయి. బాధితుల సంఖ్య 8లక్షల 6వేలు దాటింది. ఇప్పటివరకు అక్కడ 11,983 మంది కరోనాకు బలయ్యారు.
  • దేశ రాజధాని దిల్లీలో మరో 1,091 కరోనా కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 6లక్షల 17వేలు దాటింది. దిల్లీలో ఇప్పటివరకు 10,277 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

...view details