తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Covid vaccine: దేశంలో 30 కోట్ల టీకా డోసులు పంపిణీ

దేశంలో కరోనా టీకా(Corona vaccine) డోసుల పంపిణీ 30 కోట్లు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మూడో దశ టీకా పంపిణీలో భాగంగా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 7.02 కోట్ల మంది తొలిడోసు తీసుకున్నారని పేర్కొంది.

By

Published : Jun 24, 2021, 6:20 AM IST

vaccination 30 crores, india vaccine coverage
దేశంలో 30 కోట్లు దాటిన టీకా పంపిణీ

వ్యాక్సినేషన్(vaccination)​ ప్రక్రియలో భాగంగా 30 కోట్ల డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మూడో దశ వ్యాక్సినేషన్​ ప్రారంభం నుంచి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 7.02 కోట్ల మంది తొలిడోసు తీసుకోగా.. 14.98 లక్షల మంది రెండో డోసు తీసుకున్నట్లు పేర్కొంది.

అసోం, బిహార్, గుజరాత్, హరియాణా, కేరళ సహా మరో 13 రాష్ట్రాలకు చెందిన 18-44 ఏళ్ల వయసు వారిలో 10 లక్షలపైగా జనాభాకు తొలి డోసు అందించామని తెలిపింది.

ఇటీవల టీకా పంపిణీ కేంద్రం విస్తృతం చేసింది. మూడో దశ వ్యాక్సిన్​ పంపిణీలో భాగంగా రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రమే ఉచితంగా టీకా అందిస్తోంది. 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించింది.

ఇదీ చదవండి :నకిలీ వ్యాక్సిన్ ఇచ్చి ఎంపీ మిమీ చక్రవర్తికి టోకరా

ABOUT THE AUTHOR

...view details