తెలంగాణ

telangana

Coronavirus update: ఒక్కరోజు 35 వేల కేసులు.. 33 వేల రికవరీలు

By

Published : Sep 18, 2021, 10:22 AM IST

దేశంలో కరోనా కేసులు (Coronavirus update) స్థిరంగా నమోదవుతున్నాయి. తాజాగా 35 వేల 662 వైరస్​ (Coronavirus India) బారినపడ్డారు. శుక్రవారం ఒక్కరోజే 33,798 మంది కొవిడ్​ నుంచి కోలుకున్నారు.

Coronavirus update
ఇండియా కేసులు, india cases, corona cases

భారత్​లో రోజువారీ కొవిడ్​ కేసుల సంఖ్య (Coronavirus update) స్వల్పంగా పెరిగింది. ఒక్కరోజే 35,662 మందికి కరోనా పాజిటివ్​గా (Coronavirus India) నిర్ధరణ అయింది. ఒక్కరోజే 33,798 మంది కొవిడ్ (Corona update) నుంచి కోలుకున్నారు. మరో 281 మంది చనిపోయారు.

  • మొత్తం కేసులు: 3,34,17,390
  • మొత్తం మరణాలు: 4,44,529
  • మొత్తం కోలుకున్నవారు: 3,26,32,222
  • యాక్టివ్ కేసులు: 3,40,639

టెస్టులు..

సెప్టెంబర్​ 17న మొత్తం 14 లక్షల 48 వేలకుపైగా కరోనా టెస్టులు(Testing update for covid-19) నిర్వహించారు. మొత్తం కొవిడ్​ పరీక్షల సంఖ్య 55 కోట్ల 7 లక్షల 80 వేలు దాటింది.

వ్యాక్సినేషన్

దేశంలో ఇప్పటివరకు దాదాపు 80 కోట్ల టీకా డోసులను(covid vaccination) పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. శుక్రవారం ఒక్కరోజే 2.5 కోట్లకుపైగా వ్యాక్సిన్​ డోసులను లబ్దిదారులకు అందించారు. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా.. టీకా కార్యక్రమం విస్తృతంగా జరిగింది.

ప్రపంచ దేశాల్లో..

ప్రపంచ దేశాల్లోనూ కరోనా (Global corona virus update) వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 5,65,233 మందికి కరోనా(Corona update) సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 8,501 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 22,83,79,098కు చేరింది. మొత్తం మరణాల సంఖ్య 46,92,325కు పెరిగింది.

ఆయా దేశాల్లో కొత్త కేసులు..

  • అమెరికా: 157,925
  • బ్రెజిల్​: 33,519
  • రష్యా: 19,905
  • బ్రిటన్:​ 32,651
  • టర్కీ: 27,692
  • ఇరాన్​: 17,605

శ్రీలంకలో కరోనా మూడో దశ ఉద్ధృతి(Sri Lanka Third Wave) కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి విధించిన లాక్​డౌన్​ను(Sri Lanka Lockdown Update).. అక్టోబర్​ 1 వరకు పొడిగిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం చెప్పింది. శుక్రవారం ఆ దేశ ప్రధాని గొటబాయి రాజపక్స.. ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం లాక్​డౌన్​ను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి కథనంకోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మరోవైపు.. ఎప్పుడు, ఎలా, ఎక్కడినుంచి వస్తోందో అంతుచిక్కని వ్యాధితో అగ్రరాజ్య శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. హవానా సిండ్రోమ్​గా (Havana Syndrome) చెబుతున్న ఈ రుగ్మత కారణంగా ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ (Kamala Harris News) వియత్నాం పర్యటన కొన్ని గంటలు ఆలస్యం కావడంతో ఇది మరోసారి వెలుగులోకి వచ్చింది. అణ్వాయుధాలను మించి దీని ప్రభావం ఉండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఈ కథనంకోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చూడండి:కొవిడ్‌ విజేతలకు మాససిక క్షోభ- థర్డ్ వేవ్​పై భయాలు

అఫ్గాన్​కు అంతర్జాతీయ సమాజం అండగా నిలవాలి'

ABOUT THE AUTHOR

...view details