తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు భారత్​-చైనా మధ్య పదో విడత చర్చలు

భారత్​, చైనా మధ్య శనివారం పదో విడత కమాండర్​ స్థాయి చర్చలు జరగనున్నాయి. తూర్పు లద్దాఖ్​లోని పలు ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల కమాండర్ స్థాయి అధికారులు సమావేశం కానున్నారు.

By

Published : Feb 20, 2021, 5:17 AM IST

INDIA CHINA TENTH ROUND OF TALKS TO BE HELD TODAY
చైనాతో నేడు సీనియర్ కమాండర్ స్థాయి చర్చలు

భారత్, చైనా మధ్య నేడు (శనివారం) సీనియర్ కమాండర్ స్థాయి చర్చలు జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద చెలరేగిన వివాదాల పరిష్కారానికి జరుగుతున్న పదో విడత చర్చలు కావడం గమనార్హం. శనివారం ఉదయం 10 గంటలకు చైనా భూభాగంలోని మాల్దో పోస్టు వద్ద ఈ సమావేశం జరగనుంది.

తూర్పు లద్దాఖ్​లోని గోగ్రా, హాట్​స్ప్రింగ్స్​, దెప్సాంగ్​ ప్రాంతాల్లో సైనిక బలగాల ఉపసంహరణపై ఇరు దేశాలు ప్రధానంగా చర్చించనున్నాయి. భారత్ తరఫున లేహ్​లోని 14వ క్రాప్స్​ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మేనన్, చైనా తరఫున దక్షిణ షింగ్​యాంగ్​ మిలటరీ డిస్ట్రిక్ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ పాల్గొంటారు.

పాంగాంగ్​ ఉత్తర, దక్షిణ తీరాల్లో పూర్తైన బలగాల ఉపసంహరణ ప్రక్రియను సమీక్షించడంతో పాటు మిగిలిన ప్రదేశాల్లో వివాదాలపై కూడా చర్చించనున్నారు.

ఇదీ చూడండి:'ఆ రోజు చైనాతో యుద్ధం జరిగేదే'

ABOUT THE AUTHOR

...view details