తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నగల షాప్ ఓనర్​కు షాకిచ్చిన ఐటీ అధికారులు!

ఓ నగల దుకాణం యజమానికి రూ.64 లక్షల జరిమానా విధించింది ఆదాయపు పన్ను శాఖ. పన్ను చెల్లించకుండా రూ. కోట్లు విలువ చేసే బంగారం కలిగి ఉన్నందుకు చర్యలు చేపట్టింది.

By

Published : Jul 8, 2021, 12:25 PM IST

gold
జీఎస్​టీ

కర్ణాటక బెంగళూరులో ఓ ఆభరణాల దుకాణం యజమానికి రూ.64 లక్షల జరిమానా విధించారు జీఎస్​టీ అధికారులు. పన్ను చెల్లించకుండా ఖరీదైన జువెలరీ కలిగి ఉండటంపై చర్యలు తీసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న బంగారం

గతేడాది నవంబరులో రూ.కోట్లు విలువ చేసే 6.5 కిలోల బంగారం తరలిస్తూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. దర్యాప్తులో అది ఎస్​ఎస్​ జువెలరీకి చెందినదిగా గుర్తించారు. అనంతరం ఈ కేసు ఆదాయపు పన్ను విభాగానికి బదిలీ కాగా, ఈ బంగారంపై పన్ను కట్టలేదని తేలింది.

పట్టుబడిన నగలు

ఇదీ చూడండి:12 నిమిషాల్లో 17 కిలోల బంగారం​, రూ.9 లక్షలు చోరీ!

ABOUT THE AUTHOR

...view details