భారత్లో కొవిడ్ మహమ్మారి మరింత విజృంభించనుందని.. మే 14 నుంచి 18 తేదీల మధ్య క్రియాశీల కేసులు 38 నుంచి 48లక్షల గరిష్ఠానికి చేరతాయని ఐఐటీ నిపుణులు తెలిపారు. మే 4 నుంచి 8 తేదీల్లో రోజువారీ కొత్త కేసులు 4.4 లక్షల గరిష్ఠానికి చేరనున్నట్లు పేర్కొన్నారు. గణిత నమూనా ప్రకారం.. గతంలో ప్రకటించిన కేసుల అంచనాలను సవరించారు. కరోనా బారినపడేందుకు అవకాశం ఉన్న, పరీక్షించని, పరీక్షించిన, తొలగించిన-సూత్రం ప్రకారం క్రియాశీల కేసులు.. మే నెల మధ్యకాలానికి మరో 10లక్షలు పెరగనున్నట్లు ఐఐటీ కాన్పూర్, హైదరాబాద్కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇదీ చదవండి:'ఇంట్లో ఉన్నా మాస్క్ పెట్టుకోవాల్సిన సమయం'