తెలంగాణ

telangana

By

Published : Apr 9, 2021, 5:11 PM IST

ETV Bharat / bharat

'ఓటమి భయంతోనే మమత దుష్ప్రచారం'

బంగాల్​ ఎన్నికల వేళ సీఎం మమతా బెనర్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు హోంమంత్రి అమిత్ షా. ఓటమి భయంతోనే కేంద్ర బలగాలపై ఆమె ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కోల్​కతాలోని భవానీపుర్​లో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు.

I want Mamata Banerjee to have some common sense: Shah
మమతకు ఇంగితజ్ఞానం అవసరం: అమిత్​ షా

ఎన్నికల్లో ఓడిపోతాననే అసహనంతోనే కేంద్ర సాయుధ బలగాల(సీఏపీఎఫ్​)పై బంగాల్ సీఎం మమతా బెనర్జీ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. రాష్ట్రంలో తొలి మూడు విడతల్లో పోలింగ్​ జరిగిన 91 స్థానాల్లో 63 నుంచి 68 సీట్లు భాజపా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోల్​కతాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మమతపై శుక్రవారం తీవ్ర విమర్శలు చేశారు.

"మమతా బెనర్జీలా కేంద్ర సాయుధ దళాలకు వ్యతిరేకంగా అభ్యంతరకర పదజాలం వాడే ముఖ్యమంత్రిని, రాజకీయ పార్టీ అధ్యక్షులను నేను చూడలేదు. ఆమె అరాచక పాలన చేయాలనుకుంటున్నారా? అల్లర్లు సృష్టించాలని అనుకుంటున్నారా? మమతకు కొంత ఇంగితజ్ఞానం అవసరం. ఎన్నికల వేళ కేంద్ర బలగాలు హోంశాఖ కింద పనిచేయవు. ఎన్నికల సంఘం నియంత్రణలో ఉంటాయి."

- అమిత్ షా, కేంద్ర హోం మంత్రి

ఓటర్లను సీఎపీఎఫ్​ దళాలు బెదిరిస్తున్నాయని మమత చేసిన ఆరోపణలను అమిత్​షా ఖండించారు. ముస్లిం ఓట్లు చీలకుండా ఉండాలని ఆమె చేసిన విజ్ఞప్తే.. వారు టీఎంసీకి దూరమవుతున్నారని అనడానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. చొరబాట్లను అరికట్టడంలో మమత సర్కారు వైఫల్యం, సీఏఏను వ్యతిరేకించడం, బుజ్జగింపు రాజకీయాలతో బంగాల్ ప్రజలు విసిగిపోయారని చెప్పారు.

ఇంటింటి ప్రచారం..

బంగాల్​లో నాలుగో దశ ఎన్నికలు జరుగుతున్న వేళ.. భవానీపుర్​లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు అమిత్​ షా.

ప్రచారంలో కేంద్ర హోంమంత్రి

అనంతరం రాష్ట్రంలో భాజపా వ్యవస్థాపకుల్లో ఒకరైన సమరేంద్రసింగ్​ ప్రసాద్ బిస్వాస్​ ఇంట్లో మధ్యాహ్న భోజనం చేశారు అమిత్ షా. విందులో పార్టీ నేతలు స్వపన్​ దాస్​గుప్తా, దినేశ్ త్రివేది కూడా పాల్గొన్నారు.

భోజనం చేస్తున్న అమిత్​ షా

ఇదీ చూడండి:'ఈసీ నోటీసును లెక్కచేసే ప్రసక్తే లేదు'

ABOUT THE AUTHOR

...view details