తెలంగాణ

telangana

By

Published : Apr 6, 2022, 10:49 AM IST

Updated : Apr 6, 2022, 11:48 AM IST

ETV Bharat / bharat

చికిత్స చేయించలేక పదేళ్లుగా కుమారుడిని చెట్టుకు కట్టేసి..

పేదరికంతో బాధపడుతున్న ఓ తల్లిదండ్రులు అనారోగ్యం పాలైన తమ కొడుకుని పదేళ్లుగా చెట్టుకు కట్టేసిన ఘటన వెలుగు చూసింది. చికిత్స చేయించడానికి డబ్బులు లేకపోవడం వల్ల అలా చేస్తున్నామని బాలుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటన బిహార్​లో జరిగింది.

parents tied son to tree
parents tied son to tree

చికిత్స చేయించలేక పదేళ్లుగా కుమారుడిని చెట్టుకు కట్టేసి..

బిహార్​లో 10 ఏళ్లుగా ఓ బాలుడిని చెట్టుకు కట్టేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మానసిక సమస్యను ఎదుర్కొంటున్న ఆ బాలుడికి చికిత్స అందించలేక చెట్టుకు బంధిస్తున్నామని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటన గోపాల్​గంజ్​కు జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్లు దూరంలో ఉన్న సేలంపుర్​ గ్రామంలో జరిగింది.

అసలు ఏం జరిగిందంటే?.. బిహార్​లోని సేలంపుర్​ గ్రామంలో జనార్దన్​ ప్రసాద్​, సింధూదేవి దంపతులు తమ ముగ్గురు పిల్లలతో జీవిస్తున్నారు. పెద్ద కొడుకైన ఆకాశ్​కు(13) నాలుగేళ్ల వయసులో తీవ్రమైన జ్వరం వచ్చింది. నిరుపేద కుటుంబం అవ్వడం వల్ల తమ బిడ్డకు మెరుగైన చికిత్స అందించలేక పోయారు. దీంతో ఆ బాలుడు మానసికంగా కుంగిపోయాడు. అప్పటి నుంచి ఆ బాలుడిని చెట్టుకు కట్టి ఉంచుతున్నారు తల్లిదండ్రులు. బాలుడి పరిస్థితి తెలుసుకున్న స్థానిక ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిస్సహాయులైన ఆ తల్లిదండ్రులు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

కుమారుడిని కట్టేసిన తల్లిదండ్రులు

"ఆకాశ్​ నా పెద్ద కుమారుడు. పేదరికంతో మగ్గుతున్న మేము ఏమి చేయలేక చెట్టుకు కట్టేస్తున్నాం. ఏమైనప్పటికీ నా కుమారుడు మా కళ్ల మందే ఉంటున్నాడు. మమ్మలన్ని ఆదరించేవారు లేరు. ఎవరైనా వైద్యానికి డబ్బులు ఇస్తే చికిత్స చేయిస్తాం. ఆకాశ్​ మానసిక స్థితి బాగోలేదు. దీంతో చుట్టుపక్క వాళ్లకి ఇబ్బంది కలుగుతుందనే ఆలోచనతో చెట్టుకు కడుతున్నాం."

-సింధూ దేవి, బాలుడి తల్లి

ఇదీ చదవండి:ఆడపిల్ల పుట్టిందని సంబరం.. హెలికాప్టర్​లో ఇంటికి..

Last Updated : Apr 6, 2022, 11:48 AM IST

ABOUT THE AUTHOR

...view details