ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ. కేంద్రంపై ఎదురుదాడి చేశారు. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడమంటే.. దేశ ఆర్థిక భద్రతపై రాజీ పడటమేనని ఆరోపించారు. ప్రైవేటీకరణ అయితే లాభం, జాతీయీకరణ అయితే నష్టమన్న ప్రభుత్వ వైఖరిని రాహుల్ తప్పుపట్టారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
'ప్రైవేటీకరించడమంటే.. దేశ ఆర్థిక భద్రతపై రాజీ పడటమే'
ప్రభుత్వ రంగ బ్యాంకులను అమ్మి దేశ ఆర్థిక భద్రతను కేంద్రం సంక్షోభంలోకి నెట్టివేస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు సంఘాల సమాఖ్య చేపట్టిన సమ్మెకు రాహుల్ మద్దతునిచ్చారు.
కేంద్రం లాభాన్ని ప్రైవేటీకరణ చేస్తూ నష్టాలని జాతీయీకరణచేస్తోందన్న రాహుల్ గాంధీ
రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు సంఘాల సమాఖ్య ఈనెల 15, 16 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చింది. ఆందోళనబాట పట్టిన బ్యాంకు ఉద్యోగులకు. రాహుల్ ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటించారు.
TAGGED:
says Rahul; supports bank strike