పిల్లి కరిచిందని రేబిస్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన ఓ మహిళను కుక్క కాటు వేసింది. ఈ ఘటన కేరళ తిరువనంతపురంలోని విళింజమ్లో జరిగింది.
విళింజమ్కు చెందిన అపర్ణను పిల్లి కరిచింది. ఈ క్రమంలో టీకా కోసం సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన ఆమె.. అనుకోకుండా అక్కడ ఉన్న కుక్క తోకపై కాలు వేసింది. దీంతో కుక్క వెంటనే ప్రతిఘటించి.. అపర్ణ కాలిపై కాట్లు వేసింది. అపర్ణకు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమెకు సీహెచ్సీ కేంద్రంలో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. కాసేపటి తర్వాత జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆ కుక్క ఎప్పటి నుంచో అదే ఆస్పత్రిలో ఉంటోందని, దానికి రేబిస్ టీకా వేయలేదని అక్కడి వారు చెప్పారు.