DMK MP son died: తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ ఎన్ఆర్ ఇళాంగో తనయుడు రాజేశ్(22) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రాజేశ్, అతని స్నేహితుడితో చెన్నై నుంచి పుదుచ్చేరికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు.. కొట్టకుప్పం సమీపంలో అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. వాహనం బోల్తాపడి రాజేశ్ అక్కడికక్కడే మృతి చెందగా.. అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఎంపీ ఇంట తీవ్ర విషాదం- రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి
DMK MP son died: డీఎంకే ఎంపీ ఎన్ఆర్ ఇళాంగో కుమారుడు రాజేశ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చెన్నై నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా.. కొట్టకుప్పం సమీపంలో కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. దీంతో అక్కడికక్కడే రాజేశ్ మరణించాడు.
![ఎంపీ ఇంట తీవ్ర విషాదం- రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృతి DMK MP son died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14689897-thumbnail-3x2-accidenat.jpg)
DMK MP son died
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రాజేశ్ మృతదేహాన్ని బయటకు తీశారు. రాజేశ్ స్నేహితుడిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసుల నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:నీళ్ల బకెట్లో ముంచి చిన్నారి హత్య- అమ్మమ్మ ప్రియుడే నిందితుడు!