ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని అలహాబాద్ హైకోర్టు(Allahabad High Court) కేంద్రానికి సూచించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక చట్టం చేయాలని పేర్కొంది. ఆవుకు హాని చేసేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాన్ని రూపొందించాలని తెలిపింది.
భారతీయ సంస్కృతిలో ఆవు చాలా ముఖ్యమైందని జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అంతేగాకుండా ఆవు మాంసం తినడం అనేది ఎవరికీ ప్రాథమిక హక్కుకాదని తెలిపిన కోర్టు.. దానిని పూజించడంమే కాక దానిపై ఆధారపడి జీవనం సాగించే వారికి ప్రాథమిక హక్కుగా పరిగణించాలని కోరారు. ఇందుకు సంబంధించిన చట్టానికి రూపకల్పన చేయాలని ఆదేశించింది న్యాయస్థానం.