తెలంగాణ

telangana

'2019 ఎన్నికల తర్వాత తగ్గిన భాజపా సామర్థ్యం'

By

Published : Nov 20, 2020, 6:14 PM IST

బిహార్​ ఎన్నికల్లో ఎన్​డీఏ విజయ ఢంకా మోగించినా... 2019 లోక్​ సభ ఎన్నికల తర్వాత భాజపా సామర్థ్యం తగ్గిందని కాంగ్రెస్​ సీనియర్​ నేత చిదంబరం అన్నారు.

chidambaram
'2019 ఎన్నికల తర్వాత భాజపా సామర్థ్యం తగ్గింది'

బిహార్​ ఎన్నికల్లో ఎన్​డీఏ గెలిచినా... 2019 లోక్​ సభ ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ సామర్థ్యం తగ్గిందనేది స్పష్టంగా కనిపిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అన్నారు. శుక్రవారం ట్విట్టర్​ వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు.

" బిహార్​ ఎన్నికల్లో ఎన్​డీఏ 125 సీట్లు గెలిచింది. ఇందులో భాజపా 74, జేడీయూ 43, కూటమిలో మిగిలిన రెండు పార్టీలు 8 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ 8 స్థానాల్లో మహాకూటమి గెలిస్తే ఫలితం వేరేలా ఉండేది " అని మరో ట్వీట్​ చేశారు సీనియర్ కాంగ్రెస్​ నేత.

ఈ ఎన్నికల్లో ఆర్జేడీ 75 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్​ 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 సీట్లతో సరిపెట్టుకుంది.

ఇదీ చదవండి:చందా కొచ్చర్​తో కఠినంగా వ్యవహరించం: ఈడీ

ABOUT THE AUTHOR

...view details