తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ తర్వాతే మహారాష్ట్రలో లాక్​డౌన్​పై నిర్ణయం'

మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ విధింపుపై అఖిలపక్ష సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే మరో రెండు రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి లాక్​డౌన్​పై నిర్ణయం తీసుకోనున్నారు.

By

Published : Apr 10, 2021, 8:08 PM IST

Updated : Apr 10, 2021, 9:06 PM IST

Chance to make a decision on lockdown after another 2 days in maharashtra
'ఆ తర్వాతే మహారాష్ట్రలో లాక్​డౌన్​పై నిర్ణయం'

మహారాష్ట్రలో కొవిడ్​ ఉద్ధృతి ఎంతమాత్రం తగ్గనందున లాక్‌డౌన్‌ వైపే మొగ్గు చూపారు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే. వైరస్​ కట్టడికి చేపట్టాల్సిన చర్యలపై శనివారం వర్చువల్​గా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఠాక్రే. ఉద్ధవ్​ నిర్ణయాన్ని మిత్రపక్షాలు కాంగ్రెస్, ఎన్సీపీ సమర్థించాయి.

అయితే లాక్‌డౌన్‌ విధించాలనే అభిప్రాయాన్ని వ్యతిరేకించారు మాజీ సీఎం ఫడణవీస్‌. లాక్​డౌన్​కు ముందు కరోనా ప్రభావిత ప్రజలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని భాజపా భావిస్తున్నట్లు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు.

కాగా, ఆర్థిక ప్యాకేజీ రూపొందించడానికి సోమవారం సమావేశం కానున్నట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తెలిపారు. లాక్​డౌన్​పై సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సమర్థిస్తామని కాంగ్రెస్ నేత, మంత్రి అశోక్​ అన్నారు. అయితే అది గతేడాదిలా సమస్యాత్మకంగా ఉండకూడదని చెప్పారు.

ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో మరో 2 రోజుల పాటు పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు రేపు టాస్క్​ ఫోర్స్​ సమావేశం కానుంది. ఆ తర్వాతే లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:'కేంద్ర వైఫల్యమే వైరస్​ వ్యాప్తికి కారణం'

Last Updated : Apr 10, 2021, 9:06 PM IST

ABOUT THE AUTHOR

...view details