తెలంగాణ

telangana

పంచాయతీ ఆఫీస్​లో మోదీ ఫొటో కోసం గొడవ- ఒకరు అరెస్ట్

ప్రధాని మోదీ చిత్రపటాన్ని పంచాయతీ కార్యాలయంలో బలవంతంగా అమర్చినందుకు భాజపా సభ్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు కోయంబత్తూర్​లో ఈ ఘటన జరిగింది.

By

Published : Jan 25, 2022, 10:30 AM IST

Published : Jan 25, 2022, 10:30 AM IST

PM Modi's portrait at panchayat office
తమిళనాడులో ప్రధాని మోదీ చిత్రపటంపై వివాదం

పంచాయతీ కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటాన్ని బలవంతంగా అమర్చిన భాజపా సభ్యుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కోయంబత్తూర్​లోని పులువపట్టి పంచాయతీ కార్యాలయంలో జరిగింది.

గోడకు ప్రధాని మోదీ చిత్రపటాన్ని అమరుస్తున్న భాస్కరన్​

భాజపా అనుబంధ కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శి భాస్కరన్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల బృందం ఆదివారం కార్యాలయంలోకి వెళ్లింది. ప్రధాని మోదీ ఫొటో లేకుండా తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి చిత్రపటాన్ని పంచాయతీ కార్యాలయంలో పెట్టినందుకు నిర్వాహకులతో భాస్కరన్ వాగ్వాదానికి దిగారు. అయినా.. ప్రధాని మోదీ చిత్రపటాన్ని కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు అనుమతి నిరాకరించారు. దీంతో కరుణానిధి ఫొటో పక్కనే మోదీ చిత్రపటాన్ని బలవంతంగా అమర్చారు భాస్కరన్​. నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆయనపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details