తెలంగాణ

telangana

By

Published : Jul 27, 2020, 11:17 AM IST

ETV Bharat / bharat

వరద బీభత్సం.. బోటులోనే గర్భిణీ ప్రసవం

బిహార్​ తూర్పు చంపారన్​ జిల్లాలోని గోబరి గ్రామం వరదల్లో చిక్కుకుంది. ఆ గ్రామంలోని ఓ గర్భిణీకి ప్రవస వేధన మొదలైన నేపథ్యంలో ఆమెను మోటారు బోటులో ఆసుపత్రికి తరలించడానికి ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం నిర్ణయించింది. కానీ మార్గం మధ్యలోనే ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Woman's delivery pain increased on motorboat and baby born on rescue boat
వరద బీభత్సం.. మోటారు బోటులోనే గర్భిణీ ప్రసవం

బిహార్​లో వరద బీభత్సం కొనసాగుతోంది. ముఖ్యంగా తూర్పు చంపారన్​ జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని, పడవలే ఆధారమయ్యాయి. ఈ క్రమంలో గోబరి గ్రామానికి చెందిన ఓ మహిళకు ప్రసవ వేధన ప్రారంభమైంది. ఆమెను మోటారు బోటులో ఆసుపత్రికి తరలిస్తుండగా... అందులోనే ఆడ బిడ్డకు జన్మనిచ్చింది.

వరద బీభత్సం.. మోటారు బోటులోనే గర్భిణీ ప్రసవం

రిమా ప్రసవ వేధన తీవ్రమవడం వల్ల జాతీయ విపత్తు నిర్వహణ దళానికి(ఎన్​డీఆర్​ఎఫ్​) సమాచారం అందించారు స్థానికులు. దీంతో వైద్య సిబ్బందితో సహా ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం ఘటనాస్థలానికి చేరుకుంది. అక్కడ తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఆ నిండు గర్భిణీని మోటారు బోటులో ఆసుపత్రికి తరలించడానికి నిర్ణయించింది. కానీ మార్గం మధ్యలోనే ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

ప్రసవ వేధన పడుతున్న గర్భిణీ
శిశువుకు జన్మనిచ్చిన మహిళకు గాలి విసురుతున్న సహాయక సిబ్బంది

ఇదీ చూడండి:దేశంలో కొత్తగా 49,931 కేసులు.. 708 మరణాలు

ABOUT THE AUTHOR

...view details