తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టిక్​టాక్​ను మళ్లీ నిషేధిస్తారా? కోర్టు ఏం చేస్తుంది?

ఈ మధ్య కాలంలో యువతపై బాగా ప్రభావం చూపిన మొబైల్​ యాప్​ 'టిక్ ​టాక్'. అయితే తాజాగా ఈ యాప్​పై నిషేధం కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

By

Published : Nov 18, 2019, 5:41 PM IST

టిక్​టాక్​ను మళ్లీ నిషేధిస్తారా? కోర్టు ఏం చేస్తుంది?

వీడియో షేరింగ్ యాప్ 'టిక్ టాక్' ఎంత ప్రాచుర్యం పొందిందో నేటి తరానికి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యువతతోపాటు, గృహిణులు, పెద్దలు చాలా మంది ఈ యాప్​లో మునిగిపోతూ.. ప్రపంచాన్నే మరిచిపోతున్నారు. అయితే ఈ టిక్​ టాక్​ ద్వారా యువత పెడ ధోరణి పడుతుందని ఆరోపిస్తూ, యాప్​పై నిషేధం విధించాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

ముగ్గురు పిల్లల తల్లైన ముంబయి నివాసి హీనా దర్వేశ్​ నవంబర్​ 11న ఈ పిటిషన్​ దాఖలు చేశారు. టిక్​ టాక్​.. ఆత్మహత్యలు సహా చాలా నేరాలకు కారణమవుతుందని పిటిషన్​లో పేర్కొన్నారు.

"అడ్డుఅదుపు లేని అశ్లీలతను వ్యాపిస్తూ దేశ యువతకు టిక్​ టాక్​ హాని చేస్తోంది. టిక్​ టాక్​ ద్వారా హింసను, రెండు మతాల మధ్య చిచ్చును పెట్టేందుకు ప్రయత్నించిన కొంతమందిపై ఈ ఏడాది జులైలో ముంబయి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు." - పిటిషనర్​

పిటిషన్​ ఈ వారంలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే తరహా వ్యాజ్యం గత ఏడాది మద్రాసు హైకోర్టులో దాఖలైంది. యాప్​పై మొదట నిషేధం విధించిన కోర్టు.. మళ్లీ ఎత్తివేసింది.

ABOUT THE AUTHOR

...view details