తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2020, 5:29 AM IST

Updated : Feb 28, 2020, 2:33 AM IST

ETV Bharat / bharat

'ఉద్యోగాలు కల్పించకపోతే యువత కలలు తీరేదెలా?'

నరేంద్రమోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు రాహుల్​ గాంధీ, రణ్​దీప్​ సుర్జేవాలా మండిపడ్డారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోదీ సర్కారు పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఉపాధి అవకాశాలు కల్పించకుంటే.. యువత తమ కలలను ఎలా సాకారం చేసుకుంటుందని ప్రశ్నించారు.

Without employment, youngsters cannot fulfil their dreams: Rahul
'ఉద్యోగాలు కల్పించకపోతే యువత కలలు తీరేదెలా?'

భాజపా సర్కారుపై కాంగ్రెస్​ మరోమారు విరుచుకుపడింది. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో మోదీ సర్కారు విఫలమైందని హస్తంపార్టీ సీనియర్​ నేత రాహుల్​గాంధీ విమర్శించారు. ఉపాధి కొరవడితే.. యువతకు సరైన అవకాశాలు కల్పించలేమని.. అలాంటప్పుడు యువత తమ కలలను సాకారం చేసుకోలేరని వివరించారు. గత ఐదేళ్లలో ఏడు ప్రధాన రంగాల్లోని 3.64కోట్ల మంది నిరుద్యోగులుగా మారారన్న ఆయన.. ఇలాంటి పరిస్థితుల్లో గణతంత్ర రాజ్యం ఎలా బలంగా ఉంటుందని ప్రశ్నించారు.​

" గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఉద్యోగం పొందేందుకు అష్టకష్టాలు పడుతున్న లక్షలాది మంది పట్టభద్రుల గురించి ఆలోచించాలి. చదువు పూర్తి చేసుకున్న వారు సమాజంలో గౌరవంగా జీవించేందుకు ఉద్యగం ఎంతో సాయపడుతుంది. ఉద్యోగావకాశాలు లేకపోతే.. యువత వారి కలలను ఎలా సాకారం చేసుకుంటుంది."
-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ నేత

భాజపా బ్యాంక్​ బ్యాలెన్స్​ పెరుగుతోంది

మరోవైపు కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా సైతం కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రోజులు గడుస్తున్న కొద్దీ భాజపా బ్యాంక్​ బ్యాలెన్స్​ పెరుగుతోంది తప్పా.. యువతకు ఉపాధి అవకాశాలు మాత్రం మెరుగుపడలేదని విమర్శించారు.

" ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో వాగ్దానం చేశారు. దాని ప్రకారం ఐదేళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి. కానీ, గత ఐదేళ్లలో ఏడు ప్రధాన రంగాల్లోని 3.64కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు. ఓవైపు భాజపా బ్యాంక్​ బ్యాలెన్స్​ పెరుగుతూ పోతోంటూ.. మరోవైపు ఉపాధి అవకాశాలు మాత్రం తగ్గిపోతున్నాయి. "
- రణ్​దీప్​ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

Last Updated : Feb 28, 2020, 2:33 AM IST

For All Latest Updates

TAGGED:

Gangadhar Y

ABOUT THE AUTHOR

...view details