తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్రికెట్​లో జోక్యం చేసుకునేది లేదు: సుప్రీంకోర్టు

క్రికెట్ ఆటలో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు తమిళనాడు క్రికెట్ సంఘానికి స్పష్టం చేసింది. తమిళనాడు ప్రీమియర్​ లీగ్ ​లో ఆడేందుకు బయటి ప్రాంతాల వ్యక్తులను అనుమతిస్తూ పాలకమండలిని ఆదేశించాలన్న అసోసియేషన్ వ్యాజ్యంపై విచారణ చేసింది సుప్రీం కోర్టు. ఈ సందర్భంగా తాము క్రికెట్​ను పర్యవేక్షించలేమని వ్యాఖ్యానించింది. బీసీసీఐ అంబుడ్స్​మన్, అమికస్ క్యూరిల ద్వారా పరిష్కరించుకోవాలని కోర్టు తీర్పునిచ్చింది.

By

Published : Jul 4, 2019, 9:51 PM IST

క్రికెట్​లో జోక్యం చేసుకునేది లేదు: సుప్రీంకోర్టు

తమిళనాడు ప్రీమియర్​ లీగ్​లో ఆడేందుకు ఇతర రాష్ట్రాల ఆటగాళ్లను అనుమతిస్తూ ఆదేశాలివ్వాలన్న తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మేం క్రికెట్​ను పర్యవేక్షించలేమని వ్యాఖ్యానించింది. తమిళ క్రికెట్ బోర్డు బీసీసీఐ అంబుడ్స్​మన్​ను లేదా అమికస్ క్యూరీ(కేసులో కోర్టుకు సహాయపడే నిష్పక్షపాత సలహాదారు) వద్ద ఈ అంశాన్ని లేవనెత్తాలని జస్టిస్ ఎస్​ ఏ బాబ్​డే, జస్టిస్ బీ ఆర్ గవాయి ధర్మాసనం అభిప్రాయపడింది.

సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తమిళ నాడు క్రికెట్ అసోసియేషన్ తరఫున వాదనలు వినిపించారు. ఈ అంశమై తమిళనాడు ప్రీమియర్​ లీగ్ పాలకమండలిని సంప్రదించారా అని ధర్మాసనం పిటిషనరు తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. సమాధానంగా పాలక మండలి వద్ద ఈ అంశాన్ని మే నెలలోనే లేవనెత్తామని, కానీ వారు ఏ నిర్ణయమూ తీసుకోలేదని కోర్టుకు వెల్లడించారు.

బీసీసీఐ నూతన నిబంధనలకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ సహకరించడం లేదని పాలకమండలి తరఫున సీనియర్ న్యాయవాది పరాగ్ త్రిపాఠి వాదనలు వినిపించారు.

క్రికెట్​పై కోర్టు జోక్యం చేసుకోకపోతే ఆటగాళ్లు ఎక్కడికి వెళ్లగలరన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనపై 'మీ ఆట మీరు ఆడండి' అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇద్దరు ఆటగాళ్లు ఇతర ప్రాంతాల్లోని వ్యక్తులున్నారని, వారు ఐపీఎల్​లోనూ, అంతర్జాతీయ క్రికెట్​లోనూ సభ్యులు కారని తమిళ క్రికెట్ బోర్డు వాదనలు వినిపించింది.

సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహను బీసీసీఐ అమికస్ క్యూరిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు క్రికెట్​కు సంబంధించిన పలు వ్యవహారాల్లో మధ్యవర్తిగా వ్యవహరించాలని కోరింది కోర్టు.

తమిళనాడు జిల్లాల క్రికెట్ జట్ల మధ్య తమిళనాడు ప్రీమియర్​ లీగ్​ను నిర్వహిస్తోంది బీసీసీఐ. ఈ టీపీఎల్​లో ఆడిన వారిని ఐపీఎల్​కు ఎంపిక చేసేందుకు ఉద్దేశించింది.

ఇదీ చూడండి: భార్యాభర్తల మధ్య భారత్​-పాక్ సరిహద్దు

ABOUT THE AUTHOR

...view details