తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రమాదమా? దాడా?

పుల్వామా దాడిపై కాంగ్రెస్​ నేత దిగ్విజయ్​సింగ్ ట్వీట్​ వివాదాస్పదమైంది. భాజపా తీవ్ర విమర్శలు గుప్పించింది. ఎదురుదాడి చేశారు దిగ్విజయ్.

By

Published : Mar 5, 2019, 1:44 PM IST

Updated : Mar 5, 2019, 2:20 PM IST

దిగ్విజయ్​సింగ్, వీకే సింగ్

పుల్వామా ఉగ్రదాడి... భారత్​-పాకిస్థాన్​ మధ్య ఉద్రిక్తతలకు దారితీసింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఘటన.. జాతీయ రాజకీయాలనూ వేడెక్కిస్తోంది. ఉగ్రదాడికి ప్రతిగా భారత్​ నిర్వహించిన మెరుపుదాడిపై విపక్షం అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అంతే దీటుగా ఎదురుదాడి చేస్తోంది అధికార పక్షం.

తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్​సింగ్​ పుల్వామా దాడికి సంబంధించి చేసిన ఓ ట్వీట్​ వివాదాస్పదమైంది.

"పుల్వామా దుర్ఘటన తర్వాత మన వాయుసేన చేసిన దాడులపై విదేశీ మీడియా సందేహాలు వ్యక్తం చేస్తోంది. అంటే ఇది భారత ప్రభుత్వ విశ్వసనీయతనూ ప్రశ్నించినట్టే"
-దిగ్విజయ్​సింగ్, కాంగ్రెస్ సీనియర్ నేత

భాజపా ఎదురుదాడి

దిగ్విజయ్​ ట్వీట్​ను భాజపా తప్పుబట్టింది. పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి అయితే... దుర్ఘటన అనడం ఏంటని ప్రశ్నించింది.

"ఉగ్రదాడిని ప్రమాదమని చెబుతున్నారు. నేను దిగ్విజయ్​సింగ్​ను మర్యాదగా ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నా. రాజీవ్​గాంధీ హత్య ప్రమాదమేనా లేదా ఉగ్రదాడో చెప్పండి. దీనికి ఆయన జవాబు చెబితే అప్పుడు మేమూ నమ్ముతాం. "
-వీకే సింగ్, కేంద్ర మంత్రి

విమర్శలే వారి ఆయుధం

ట్వీట్​తో చెలరేగిన వివాదంపై దిగ్విజయ్​ స్పందించారు. ప్రతివిమర్శలతోనే భాజపా సమాధానం దాటవేస్తోందని మండిపడ్డారు.

"పుల్వామాలో జరిగింది ఉగ్రదాడి అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మళ్లీ మోదీ 'విమర్శల సైన్యం' సమాధానాన్ని దాటవేసేందుకే ప్రయత్నిస్తోంది."
-దిగ్విజయ్​ సింగ్​, కాంగ్రెస్ సీనియర్ నేత

ఇదీ చూడండి:"పాక్ పత్రికల్లో మన ప్రతిపక్షం"

Last Updated : Mar 5, 2019, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details