తెలంగాణ

telangana

By

Published : Mar 2, 2019, 8:29 AM IST

ETV Bharat / bharat

"వాయుసేన గర్విస్తోంది "

పాకిస్థాన్​ సైన్యం చెరబట్టిన భారత వాయుసేన వింగ్​ కమాండర్ అభినందన్​​ వర్ధమాన్​ సగర్వంగా స్వదేశంలో అడుగుపెట్టారు. మాతృభూమికి తిరిగి రావటం బాగుందని అభినందన్​ వ్యాఖ్యానించారు.

"వాయుసేన గర్విస్తోంది "

స్వదేశానికి తిరిగి రావటం బాగుందని వైమానిక దళ వింగ్​ కమాండర్​ అభినందన్​ వర్ధమాన్​ వ్యాఖ్యానించినట్లు ఓ వైమానిక అధికారి వెల్లడించారు. పైలట్​ రాకపై ట్విట్టర్​ వేదికగా వాయుసేన హర్షం వ్యక్తం చేసింది. గగన వీరుడిని చూసి భారత వాయుసేన గర్విస్తుందని తెలిపింది.

వైమానిక దళ వింగ్​ కమాండర్ అభినందన్​​ మళ్లీ మనతో ఉన్నారు. ఈ సైనికుడి పట్ల భారత వాయుసేన గర్వంగా ఉంది. - ట్విట్టర్​లో ఐఏఎఫ్​

దాదాపు 3 రోజుల పాటు పాక్​ చెరలో తీవ్ర ఒత్తిడిలో ఉన్న అభినందన్​కు వైద్య పరీక్షలు చేయనున్నట్లు ఎయిర్​ వైస్​ మార్షల్​ ఆర్​జీకే కపూర్​ తెలిపారు.

ఏం జరిగింది..?

పుల్వామా దాడిలో 40 మంది వీర జవాన్ల మృతికి కారణమైన 'జైషే మహ్మద్‌' తీవ్రవాద సంస్థ శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. ఈ చర్యకు పాక్‌ స్పందించింది. ఎఫ్​-16 యుద్ధవిమానాలతో భారత సైనిక శిబిరాలపై దాడులకు యత్నించింది.

పాక్‌ యుద్ధవిమానాలను రాడార్‌ల ద్వారా ముందే గుర్తించిన భారత వాయుసేన ఎదురుదాడికి దిగింది. పాకిస్థాన్‌ ఎఫ్​-16 యుద్ధవిమానాన్ని, మిగ్‌-21 యుద్ధవిమానంతో వింగ్‌ కమాండర్‌ అభినందన్ పేల్చేశారు. పాక్‌ దాడిలో అభినందన్‌ ఉన్న మిగ్‌ 21 విమానం కూలిపోయింది. కూలిపోతున్న సమయంలో అభినందన్‌ తప్పించుకునే ప్రయత్నం చేశారు. పారాషూట్​ సాయంతో పాక్‌ భూభాగంలోకి దూకేశారు. అతడిని పట్టుకున్న పాక్‌ భారత్‌పై ఒత్తిడి పెంచే యత్నం చేసింది.

ABOUT THE AUTHOR

...view details