తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నక్సలైట్ల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి

ఛత్తీస్​గఢ్​ బిజాపుర్​ జిల్లాలో నక్సలైట్లు, బలగాల మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు, ఓ బాలిక మృతి చెందారు.

By

Published : Jun 28, 2019, 3:03 PM IST

Updated : Jun 28, 2019, 3:42 PM IST

నక్సలైట్ల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

ఛత్తీస్​గఢ్​ బిజాపుర్​లో ఎన్​కౌంటర్ జరిగింది. ముగ్గురు సీఆర్​పీఎఫ్​ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని భైరామ్​గఢ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని కేశ్​కుతుల్​ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

నక్సలైట్లు ఉన్నారన్న సమాచారంతో సీఆర్​పీఎఫ్​లోని 199 బెటాలియన్​కు చెందిన బలగాలు, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జవాన్లపై నక్సలైట్లు కాల్పులకు తెగబడ్డారు.

ఎదురుకాల్పుల్లో గూడ్స్​ వాహనంలో వెళుతున్న ఇద్దరు బాలికలకు తూటాలు తగిలాయి. అందులో ఒకరు మృతి చెందగా.. ఒకరికి తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలానికి మరింత మంది బలగాలను తరలించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి:'ప్రజాస్వామ్య పునరుద్ధరణ, ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యం'

Last Updated : Jun 28, 2019, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details