అగ్రరాజ్య అధినేతకు ఘనంగా ఆతిథ్యమిచ్చేందుకు భారత్ సన్నద్ధమవుతోంది. ఈనెల 24, 25న జరగనున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
ఈ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్లో నిర్మించిన భారీ స్టేడియంను భారత ప్రధానమంత్రి మోదీ, ట్రంప్ కలిసి ప్రారంభించనున్నారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఇరువురు దేశాధినేతలు స్టేడియంలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియంపై అందరి దృష్టి నెలకొంది.
ప్రధాని కలల స్టేడియం...
మోటేరా స్టేడియానికి 'సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియం' అని పేరుమార్చారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్. ప్రధాని గుజరాత్ క్రికెట్ ఆసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దీనిని నిర్మించాలని సంకల్పించారు.
విశేషాలు...
నవీకరణ...
2015లో మైదానాన్ని పూర్తిగా కూల్చేసి నూతనంగా నిర్మాణ పనులు ప్రారంభించారు. 3 ప్రవేశ ద్వారాలతో 63 ఏకరాల్లో ఈ స్టేడియం ఉంది. ఇందులో ఒలింపిక్ స్థాయి ఈత కొలను, నాలుగు డ్రెస్సింగ్ రూమ్లు, 75 కార్పొరేట్ బాక్స్లు ఉన్నాయి. ఇందులో ప్రధాన ప్రత్యేకత ఎల్ఈడీ దీపాలు. సాధారణంగా స్టేడియంలో ఉండే ఫ్లడ్లైట్లు కాకుండా ఇక్కడ ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు.
ఖర్చు...