తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హద్దులు మాయం- 15 ట్రాన్స్​జెండర్​ జంటల వివాహం

ఛత్తీస్​గఢ్​ రాజధాని రాయ్​పూర్​లో సామాజిక హద్దులను చెరిపేశారు ట్రాన్స్​జెండర్లు. ఒకరినొకరు ఇష్టపడిన 15 జంటలు ఏకమయ్యాయి. ఇలాంటి వివాహాలు జరగటం దేశంలో ఇదే తొలిసారి అంటూ గర్వంగా చెబుతున్నారు ఈ ట్రాన్స్​జెండర్ ప్రేమికులు.

By

Published : Mar 31, 2019, 3:37 PM IST

ట్రాన్స్​జెండర్​

సామూహిక ట్రాన్స్​జెండర్ల వివాహం
ఎనిమిదేళ్ల క్రితం మహారాష్ట్ర నాగ్​పూర్​లోని గులాం నబీ అన్సారీతో ప్రేమలో పడింది ట్రాన్స్​జెండర్​ సలోని. వారి కుటుంబాలు మాత్రం పెళ్లికి నిరాకరించాయి. వారి బంధాన్ని చూసి ఇతరులు అపహాస్యం చేశారు. అయినా ఆ జంట ఒకరినొకరు వీడలేదు. సలోని-అన్సారీ జంట తాజాగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది.

ఛత్తీస్​గఢ్​ రాయ్​పూర్​లో ట్రాన్స్​జెండర్ల సామూహిక వివాహాలు ఆదివారం జరిగాయి. ఇందులో 15 జంటలు సామాజిక హద్దులను చెరిపేసి ఒక్కటై తమకూ సాధారణంగా జీవించే హక్కు ఉందని చాటి చెప్పారు.

2014లో ట్రాన్స్​జెండర్లను మూడో లింగమని గుర్తింపునిస్తూ సుప్రీం తీర్పునిచ్చింది. వారికి అన్ని హక్కులు ఉండాలని తేల్చిచెప్పింది. సుప్రీం తీర్పును పూర్తిస్థాయిలో ఆచరణలోకి తెచ్చేందుకు ట్రాన్స్​జెండర్ల సామాజిక కార్యకర్త విద్యా రాజ్​పుత్​ నడుం బిగించారు.

తన ప్రయత్నంలో భాగంగా ట్రాన్స్​జెండర్లకు పెళ్లిళ్లు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు విద్యా రాజ్​పుత్. ఈ కార్యక్రమానికి 15 జంటలు ముందుకొచ్చాయి. ఇందులో ఆరు రాష్ట్రాలకు చెందిన ట్రాన్స్​జెండర్లు ఉన్నారు. విద్య కృషి ఫలితంగానే రాయ్​పూర్​ పుజారి పార్క్​ ప్యాలెస్​లో అన్సారీ-సలోనిల కల నిజమైంది.

ఇదీ చూడండి:విదేశాలకు ఆదివాసీల 'విప్పపువ్వు సారా'

ABOUT THE AUTHOR

...view details