తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మీరు అడ్డుకునేది నన్నే... భాజపా విజయాన్ని కాదు'

'జై శ్రీరామ్' అని నినదించినందుకు ధైర్యముంటే తనను అరెస్టు చేయాలని మమతా బెనర్జీకి సవాల్ విసిరారు భాజపా అధ్యక్షుడు అమిత్​ షా. బంగాల్​లో తన ర్యాలీలను దీదీ  అడ్డుకోవచ్చేమోకానీ భాజపా విజయాన్ని ఆపలేరని వ్యాఖ్యానించారు. బంగాల్​ జయనగర్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు షా.

By

Published : May 13, 2019, 4:34 PM IST

'మీరు అడ్డుకునేది నన్నే... భాజపా విజయాన్ని కాదు'

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా. అందుకే బంగాల్​లో తన ర్యాలీలకు అనుమతి ఇవ్వట్లేదని ఆరోపించారు. బంగాల్​ జయ్​నగర్​ కేనింగ్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు షా.

జాదవ్​పుర్​ లోక్​సభ నియోజకవర్గంలో అమిత్​ షా సభకు అనుమతి నిరాకరించింది మమత ప్రభుత్వం. అక్కడ తాను ప్రచారం నిర్వహిస్తే ఆమె మేనల్లుడు ఓడిపోతారని మమత కలవరపడుతున్నారని విమర్శించారు షా. భాజపా ర్యాలీలను అడ్డుకోగలరేమో కానీ విజయాన్ని కాదన్నారు. మమతకు బంగాల్ ప్రయోజనాల కంటే ఓటు బ్యాంకు రాజకీయాలే ముఖ్యమని ధ్వజమెత్తారు.

సభలో మాట్లాడుతున్న అమిత్​ షా

"మమత బంగాల్​లో జై శ్రీరామ్​ అనొద్దంటున్నారు. జయ్​నగర్​లో జై శ్రీరామ్​ అని నినదిస్తున్నా. ఇక్కడి నుంచి కోల్​కతా వెళుతున్నా. ధైర్యముంటే నన్ను అరెస్టు చెయ్యాలి. మీరు సభలకు అనుమితిచ్చినా, ఇవ్వకపోయినా. తృణమూల్​ను లోక్​సభ ఎన్నికల్లో ఓడించాలని బంగాల్​ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. "
-అమిత్ షా, భాజపా అధ్యక్షుడు

ఇదీ చూడండి: పోలింగ్ సమయం మార్చలేం: సుప్రీంకోర్టు

ABOUT THE AUTHOR

...view details