తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నక్సలైట్ల దుశ్చర్యకు ముగ్గురు సామాన్యులు బలి

ఛత్తీస్​గఢ్​ కాంకేర్​ జిల్లాలో నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. డీజిల్ ట్యాంకర్‌ లక్ష్యంగా బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

By

Published : Sep 24, 2019, 2:58 PM IST

Updated : Oct 1, 2019, 7:58 PM IST

నక్సలైట్ల దుశ్చర్యకు ముగ్గురు సామాన్యులు బలి

నక్సలైట్ల దుశ్చర్యకు ముగ్గురు సామాన్యులు బలి

ఛత్తీస్​గఢ్​లోని కాంకేర్​ జిల్లాలో నక్సలైట్లు దారుణానికి ఒడిగట్టారు. డీజిల్​ ట్యాంకర్​ను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి చేశారు. ఈ పేలుడులో ముగ్గురు పౌరులు మృతి చెందారు.

కొస్రొండ, టుమాపాల్ గ్రామాల మధ్య ఉదయం 11 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు బస్తర్ రేంజ్ ఐజీ వివేకానంద సిన్హా తెలిపారు. రైల్వే ట్రాక్​ నిర్మాణం కోసం వచ్చిన డీజిల్ ట్యాంకర్​ను పేల్చేయగా... డ్రైవర్​ సహా అందులో ఉన్న మరో ఇద్దరు చనిపోయినట్లు వివరించారు. నక్సలైట్ల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి : 'సోషల్ మీడియా నియంత్రణకు ప్రత్యేక మార్గదర్శకాలు'

Last Updated : Oct 1, 2019, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details